టీడీపీ- బీజేపీ.. ఓ బ్రహ్మాండమైన డ్రామా! - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » టీడీపీ- బీజేపీ.. ఓ బ్రహ్మాండమైన డ్రామా!

టీడీపీ- బీజేపీ.. ఓ బ్రహ్మాండమైన డ్రామా!

Written By news on Tuesday, March 10, 2015 | 3/10/2015


టీడీపీ- బీజేపీ.. ఓ బ్రహ్మాండమైన డ్రామా!
హైదరాబాద్ : తెలుగుదేశం పార్టీ, బీజేపీ కలిసి ఏపీ అసెంబ్లీలో బ్రహ్మాండమైన డ్రామా ఆడుతున్నాయని అసెంబ్లీలో విపక్షనేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మండిపడ్డారు. బయటేమో రెండు పార్టీల నాయకులు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటారని, సభలో మాత్రం పరస్పరం పొగుడుకుంటూ జగన్ ను విమర్శిస్తారని ఆయన అన్నారు. తమ చేతుల్లో ఏమీ లేకున్నా మూడుసార్లు ఢిల్లీకి వెళ్లి కేంద్రాన్ని ఏపీకి సాయం చేయాలని కోరినట్లు ఆయన మంగళవారం నాటి అసెంబ్లీ సమావేశాల్లో చెప్పారు.

ఇంకా ఆయన ఏమన్నారంటే...
  • వైఎస్ రాజశేఖరరెడ్డి ఉన్నంతవరకు జగన్ మోహన్ రెడ్డిపై అవినీతి ఆరోపణలు రాలేదు
  • కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు కూడా అవినీతి ఆరోపణలు రాలేదు
  • వైఎస్ చనిపోయిన తర్వాత, కాంగ్రెస్ పార్టీని వీడిన తర్వాతే జగన్ పై ఆరోపణలు చేశారు
  • చంద్రబాబు రాజకీయాల్లోకి వచ్చినప్పుడు ఆయన ఆస్తి రెండున్నర ఎకరాలు మాత్రమే
  • చంద్రబాబు అంత అవినీతిపరుడు దేశంలోనే ఎవరూ లేరని ఎన్టీఆర్ అన్నారు
  • చంద్రబాబు జమానా.. అవినీతి ఖజానా అని కమ్యూనిస్టులు పుస్తకం విడుదల చేశారు
  • హెరిటేజ్ సంస్థ తెలుగు రాష్ట్రాల్లోనే కాదు.. పక్క రాష్ట్రాల్లో కూడా ఉంది
  • చంద్రబాబు మీద 1000 పేజీల నిండా ఆరోపణలు కోర్టుకు వెళ్లాయి
  • ఆయన అదృష్టం కొద్దీ సాంకేతిక కారణాలతో కోర్టు ఆ కేసును విచారణకు తీసుకోలేదు
  • రాజకీయాల్లో అవినీతి ఆరోపణలు ఎలా చేస్తారో, కేసుల్లో ఎలా ఇరికిస్తారో అందరికీ తెలిసిందే
  • చంద్రబాబు 16 కోట్ల రూపాయలు ఖర్చుపెట్టి ప్రైవేటు విమానాల్లో తిరుగుతున్నారు
Share this article :

0 comments: