హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు రెండోరోజు ప్రారంభం అయ్యాయి. సోమవారం ఉదయం సభ ప్రారంభం కాగానే వాయిదా తీర్మానాలను స్పీకర్ కోడెల శివప్రసాద్ తిరస్కరించారు. అయితే వాయిదా తీర్మానాలపై చర్చకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పట్టుబట్టింది. రైతు సమస్యలు, రైతుల ఆత్మహత్యలు, కరవు సమస్యలపై చర్చకు అనుమతి ఇవ్వాలంటూ వైఎస్ఆర్ సీపీ సభ్యులు డిమాండ్ చేశారు.
దాంతో సభ ప్రారంభంలోనే గందరగోళం నెలకొంది. కాగా సభ సజావుగా జరిగేందుకు సభ్యులు సహకరించాలని స్పీకర్ విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా కాల్వ శ్రీనివాసులు చేసిన వ్యాఖ్యలను వైఎస్ఆర్ సీపీ సభ్యులు అభ్యంతరం తెలిపారు. వైఎస్ఆర్ సీపీ సభ్యుల నినాదాలతో సభ దద్దరిల్లింది.
దాంతో సభ ప్రారంభంలోనే గందరగోళం నెలకొంది. కాగా సభ సజావుగా జరిగేందుకు సభ్యులు సహకరించాలని స్పీకర్ విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా కాల్వ శ్రీనివాసులు చేసిన వ్యాఖ్యలను వైఎస్ఆర్ సీపీ సభ్యులు అభ్యంతరం తెలిపారు. వైఎస్ఆర్ సీపీ సభ్యుల నినాదాలతో సభ దద్దరిల్లింది.
0 comments:
Post a Comment