హైదరాబాద్: టీడీపీ 10 నెలల పాలనలో ఒక్క కొత్త ఇల్లు కూడా ఇవ్వలేదని ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నాయకుడు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. కొత్త ఇళ్లు ఇవ్వకపోగా ఇంతకుముందు మంజూరు చేసిన ఇళ్లను రద్దు చేశారని అసెంబ్లీలో అన్నారు.
పేదల ఇళ్ల గురించి తాము అడుగుతుంటే తల్లి కాంగ్రెస్, పిల్ల కాంగ్రెస్ అంటూ అభండాలు వేస్తున్నారని అన్నారు. కిరణ్ కుమార్ రెడ్డి సర్కారును కాపాడి టీడీపీ.. తెలుగుకాంగ్రెస్ గా వ్యవహరించిందని జగన్ గుర్తు చేశారు. విప్ జారీచేసి కిరణ్ ప్రభుత్వాన్ని కాపాడారని అన్నారు. దివంగత మహానేత వైఎస్ రాజశేఖరెడ్డి 48 లక్షల ఇళ్లు కట్టి చూపించారని చెప్పారు. టీడీపీ సర్కారు ఒక్క కొత్త ఇల్లు కట్టించిన పాపాన పోలేదని వైఎస్ జగన్ విమర్శించారు.
పేదల ఇళ్ల గురించి తాము అడుగుతుంటే తల్లి కాంగ్రెస్, పిల్ల కాంగ్రెస్ అంటూ అభండాలు వేస్తున్నారని అన్నారు. కిరణ్ కుమార్ రెడ్డి సర్కారును కాపాడి టీడీపీ.. తెలుగుకాంగ్రెస్ గా వ్యవహరించిందని జగన్ గుర్తు చేశారు. విప్ జారీచేసి కిరణ్ ప్రభుత్వాన్ని కాపాడారని అన్నారు. దివంగత మహానేత వైఎస్ రాజశేఖరెడ్డి 48 లక్షల ఇళ్లు కట్టి చూపించారని చెప్పారు. టీడీపీ సర్కారు ఒక్క కొత్త ఇల్లు కట్టించిన పాపాన పోలేదని వైఎస్ జగన్ విమర్శించారు.
0 comments:
Post a Comment