అక్టోబర్ మూడు నుంచి మూడు రోజులపాటు పరామర్శ యాత్ర - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » అక్టోబర్ మూడు నుంచి మూడు రోజులపాటు పరామర్శ యాత్ర

అక్టోబర్ మూడు నుంచి మూడు రోజులపాటు పరామర్శ యాత్ర

Written By news on Friday, September 25, 2015 | 9/25/2015


వస్తున్నా.. మీ కోసం
3న మహానేత తనయ షర్మిల రాక
- మూడు రోజులు పరామర్శ యాత్ర
- తొమ్మిది మండలాలు.. 1,100 కిలోమీటర్లు
- 10 కుటుంబాలకు ఆత్మీయ పలకరింపు
- విజయవంతం చేయండి
- వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు అనిల్‌కుమార్
ఆదిలాబాద్ అర్బన్ :
 దివంగత మహానేత వైఎస్.రాజశేఖరరెడ్డి తనయ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధితనే జగన్‌మోహన్‌రెడ్డి సోదరి షర్మిల అక్టోబర్ 3న జిల్లాకు రానున్నారు. వైఎస్.రాజశేఖరరెడ్డి అకాల మరణా న్ని తట్టుకోలేక తనువు చాలించిన వారి కుటుంబాలను పరామర్శిస్తారు. గురువారం ఆదిలాబాద్ ప్రింట్ మీడియా ప్రెస్‌క్లబ్‌లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు బి.అనిల్‌కుమార్ వివరాలు వెల్లడించారు. వైఎస్సార్ మరణా న్ని తట్టుకోలేక మరణించిన వారి కు టుంబాలను పరామర్శిస్తానని వైఎస్.జగన్‌మోహన్‌రెడ్డి ఇచ్చిన మాట ప్రకా రం ఆయన సోదరి వస్తున్నట్లు తెలిపా రు. అక్టోబర్ మూడు నుంచి మూడు రోజులపాటు పరామర్శ యాత్ర సాగుతుందని చెప్పారు. 10 కుటుంబాలను పరామర్శిస్తారని పేర్కొన్నారు. జిల్లాలో ని తొమ్మిది మండలాల్లో 1,100 కిలోమీటర్లకుపైగా యాత్ర కొనసాగుతుందని వివరించారు.

ఆ పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి నేతృత్వంలో ఈ యాత్ర కొనసాగుతుందని తెలిపారు. అక్టోబర్ 3న మధ్యాహ్నం నిర్మల్‌కు చేరుకుంటారని అన్నా రు. నిర్మల్ నియోజకవర్గంలోని దిలావర్‌పూర్, ముథోల్ మండలం అవర్‌గాం, బోథ్ మండలం బజార్‌హత్నూర్, ఖానాపూర్ మండలం సత్తెనపల్లి, తాటిగూడ, కడెం మండలం లింగాపూర్, కాసిపేట మండలం దేవాపూర్, వేమనపల్లి మండలం లక్ష్మిపూర్, కాగజ్‌నగర్ మండ లం చింతగూడ, జన్నారం మండల కేంద్రంలో పరామర్శయాత్ర కొనసాగుతుందని వివరించారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు, వైఎస్సార్ అభిమానులు, ప్రజలు ఆత్మీయ స్వాగతం పలికేందుకు తరలిరావాలని పిలుపునిచ్చారు. వైఎస్సార్ సీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎస్‌కె.సికిందర్, కార్యదర్శి మేస్రం శంకర్, ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు ఎం.గంగన్న, యూత్ జిల్లా అధ్యక్షుడు తిలక్‌రావు, తొడసం నాగోరావు, సయ్యద్ సలీం, సాదుల్లా పాల్గొన్నారు.
Share this article :

0 comments: