గుంటూరు : వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తలపెట్టిన నిరవధిక నిరాహార దీక్షకు పోలీసులు అనుమతి నిరాకరించారు. దీక్ష ప్రాంగణానికి దగ్గరలో ఆస్పత్రులు, విద్యాసంస్థలు ఉన్నాయని సాకులు చెబుతున్నారు. ట్రాఫిక్కు ఇబ్బందితో పాటు వినాయక చవితి నిమజ్జనం సందర్భంగా సమస్యలు నెలకొంటాయనే నెపంతో పోలీసులు అనుమతి నిరాకరించినట్లు తెలుస్తోంది.
కాగా ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈనెల 26వ తేదీ నుంచి గుంటూరులో నిరవధిక నిరాహారదీక్ష చేస్తానని ముందుగానే ప్రకటించిన విషయం తెలిసిందే. ఏపీకి ప్రత్యేక హోదా కోసం ఈ నెల 15 నుంచి గుంటూరులో దీక్ష చేపట్టాలని వైఎస్ జగన్ ఇంతకుముందు నిర్ణయించారు. అయితే 17న వినాయక చవితి పండగ ఉండటంతో పార్టీ శ్రేణుల సూచన మేరకు దీక్ష తేదీని వాయిదా వేసుకున్నారు. వైఎస్ జగన్ దీక్షకు ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పలు యూనివర్సిటీల నుంచి మద్దతు వెల్లువెత్తుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో దీక్ష కొనసాగనివ్వనిస్తే తమకు ఇబ్బంది అవుతుందనే ఉద్దేశంతోనే ప్రభుత్వ వర్గాలు ఇలా అనుమతి నిరాకరించినట్లు తెలుస్తోంది.
0 comments:
Post a Comment