పశ్చిమగోదావరి(జంగారెడ్డిగూడెం): రెండు రోజుల క్రితం విజయవాడ స్టెల్లా కాలేజీలో ఆత్మహత్య చేసుకున్న భానుప్రీతి కుటుంబాన్ని వైఎస్ఆర్ సీపీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు ఆర్కే రోజా పరామర్శించారు. భానుప్రీతి కుటుంబానికి అండగా ఉంటామని తెలిపారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ.. ఏపీ మంత్రులు పీతల సుజాత, గంటా శ్రీనివాసరావు, పి.నారాయణలు వెంటనే రాజీనామా చేయాలని లేనిపక్షంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడే వారిని బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు.
విద్యార్థులు పిట్టల్లా రాలిపోతున్నా పట్టించుకోకుండా చోద్యం చూస్తోందని టీడీపీ ప్రభుత్వంపై ఆమె మండిపడ్డారు. పీతల సుజాత స్త్రీ, శిశు సంక్షేమశాఖల మంత్రి అయినప్పటికీ విద్యార్థినుల సమస్యలు పట్టించుకోకుండా ఆదాయం వచ్చే గనులపైనే ఆమె దృష్టిపెడుతున్నదని ఆమె విమర్శించారు. భానుప్రీతి మృతిపై అనేక అనుమానాలు ఉన్నాయని, సిట్టింగ్ జడ్జితో విచారణ చేయించాలని వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే రోజా ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
0 comments:
Post a Comment