ప్రత్యేక హోదాపై విపక్ష నేత, వైఎస్ ఆర్ కాంగ్రెస్ అధినేత జగన్ చేయతలపెట్టిన నిరవధిక దీక్షకు పార్టీ నేతలు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ ఏర్పాట్ల కోసం ముందుగా భూమి పూజ కూడా నిర్వహించడం విశేషం. గుంటూరు ఎసి కాలేజీ ఎదుట ఉన్న మైదానంలో ఈ భూమి పూజ జరిగింది. కూర్చోవడానికి అవసరమైన వేదిక తదితర ఏర్పాట్లు ఇక్కడ ఉంటాయి. అలాగే ప్రజలు రావడానికి , నేతల ఉపన్యాసాలు వినడానికి అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నారు.ఈ భూమి పూజ కార్యక్రమానికి సీనియర్ నేతలు బొత్స సత్యనారాయణ, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, అంబటి రాంబాబు, మర్రి రాజశేఖర్ తదితరులు హాజరయ్యారు.ఈ నెల ఇరవైఆరో తేదీన జగన్ ఈ దీక్షకు దిగుతున్నారు.
Home »
» దీక్ష స్థలంలో భూమి పూజ
దీక్ష స్థలంలో భూమి పూజ
Written By news on Sunday, September 20, 2015 | 9/20/2015
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment