తిరుపతి మంగళం : ప్రజా సంక్షేమం, విద్యార్థుల అభ్యున్నతి, యువత భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్.జగన్మోహన్రెడ్డి రాష్ట్రానికి ప్రత్యేక హోదా తీసుకురావాలన్న ఆశయ సాధన చాలా గొప్పదని పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. చిత్తూరుకు చెందిన కార్పొరేటర్, కాంగ్రెస్ పట్టణాధ్యక్షుడు కేపీ.శ్రీధర్, మాజీ సర్పంచ్ శివకుమార్, ఎంపీటీసీ మాజీ సభ్యులు సత్యబాబు, టీడీపీ నేతలు కట్టమంచి కుమార్ పెద్దిరెడ్డి సమక్షంలో మంగళవారం వైఎస్సార్సీపీలో చేరారు.
ప్రజా సంక్షేమాన్ని విస్మరిస్తున్న చంద్రబాబుకు బుద్ధి వచ్చేలా జగన్మోహన్రెడ్డి చేస్తున్న పోరాటంలో భాగస్వాములు కావాలనే ఉద్దేశంతోనే పార్టీలో చేరినట్లు శ్రీధర్, శివకుమార్, సత్యబాబు, కట్టమంచి కుమార్ తెలిపారు. పార్టీ అభ్యున్నతి కోసం పనిచేయాలని పెద్దిరెడ్డి వారికి సూచించారు. చిత్తూరు కార్పొరేటర్, పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి పురుషోత్తంరెడ్డి, పార్టీ నగర అధ్యక్షుడు చంద్రశేఖర్, నాయకులు జగదీష్, నరేష్ చంద్రారెడ్డి, జస్టిన్ పాల్గొన్నారు.
ప్రజా సంక్షేమాన్ని విస్మరిస్తున్న చంద్రబాబుకు బుద్ధి వచ్చేలా జగన్మోహన్రెడ్డి చేస్తున్న పోరాటంలో భాగస్వాములు కావాలనే ఉద్దేశంతోనే పార్టీలో చేరినట్లు శ్రీధర్, శివకుమార్, సత్యబాబు, కట్టమంచి కుమార్ తెలిపారు. పార్టీ అభ్యున్నతి కోసం పనిచేయాలని పెద్దిరెడ్డి వారికి సూచించారు. చిత్తూరు కార్పొరేటర్, పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి పురుషోత్తంరెడ్డి, పార్టీ నగర అధ్యక్షుడు చంద్రశేఖర్, నాయకులు జగదీష్, నరేష్ చంద్రారెడ్డి, జస్టిన్ పాల్గొన్నారు.
0 comments:
Post a Comment