Home »
» సమర దీక్షకు బయల్దేరిన విజయమ్మ
సమర దీక్షకు బయల్దేరిన విజయమ్మ
Written By news on Monday, August 19, 2013 | 8/19/2013
అన్ని ప్రాంతాలకు సమన్యాయం చేయాలంటూ నేటి నుంచి సమర దీక్షకు సిద్ధమైన వైఎస్ఆర్ కాంగ్రెస్పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ సోమవారం గుంటూరు బయల్దేరారు. ఆమె ఈరోజు ఉదయం లోటస్ పాండ్ నుంచి బయల్దేరి విమానంలో ఉదయం 9.45 గంటలకు గన్నవరం చేరుకుంటారు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో బయలుదేరి 10.30 గంటలకు దీక్షా ప్రాంగణానికి చేరుకుంటారు. దివంగత మహానేత వై.ఎస్.రాజశేఖరరెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించి, సర్వమత ప్రార్థనల్లో పాల్గొంటారు. అనంతరం ‘సమర దీక్ష’ ప్రారంభిస్తారు.
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment