గాంధీజీకి నివాళులర్పించిన విజయమ్మ - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » గాంధీజీకి నివాళులర్పించిన విజయమ్మ

గాంధీజీకి నివాళులర్పించిన విజయమ్మ

Written By news on Tuesday, October 2, 2012 | 10/02/2012

పులివెందుల : గాంధీ జయంతి సందర్బంగా వైఎస్‌ఆర్‌ జిల్లా పులివెందులలో వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్‌ విజయమ్మ మంగళవారం గాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమానికి జనం భారీగా తరలివచ్చారు. అనంతరం విజయమ్మ అక్కడి నుంచి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయానికి బయలుదేరి వెళ్లారు. ఇవాళ, రేపు పులివెందులలోనే ఉండి విజయమ్మ ప్రజా సమస్యలను అధికారుల దృష్టికి తీసుకువెళతారు.

హైదరాబాద్: జాతిపిత మహాత్మ గాంధీ జయంతిని పురస్కరించుకుని వైఎస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రధాన కార్యాలయంలో ఆయనకు ఘన నివాళులుఅర్పించారు ఆ పార్టీ నేతలు. దేశ ప్రజలు గాంధీ మార్గంలో పయనించాలని ఎంపీ మేకపాటి పిలుపునిచ్చారు. గాంధీ సిద్ధాంతాలను విదేశాల్లో కూడా పాటిస్తున్నారని ఆయన తెలిపారు. ప్రపంచ దేశాలన్నీ గాంధీ మార్గంలో పయనించినప్పుడే శాంతి వర్ధిల్లుతుందన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్‌ కాంగ్రెస్‌ అధికార ప్రతినిధి జనక్‌ ప్రసాద్‌, మహిళా విభాగం అధ్యక్షురాలు కొల్లి నిర్మలాకుమారి , యువజన విభాగం అధ్యక్షుడు పుత్తా ప్రతాప్‌ రెడ్డి పలువురు వైఎస్ఆర్‌ కాంగ్రెస్‌ నేతలు పాల్గొన్నారు. 
Share this article :

0 comments: