క్విడ్‌ప్రోకో కేసులో సీబీఐ మూడు చార్జ్ షీట్లు - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » క్విడ్‌ప్రోకో కేసులో సీబీఐ మూడు చార్జ్ షీట్లు

క్విడ్‌ప్రోకో కేసులో సీబీఐ మూడు చార్జ్ షీట్లు

Written By news on Tuesday, September 10, 2013 | 9/10/2013

క్విడ్ప్రోకో కేసులో మూడు చార్జ్షీట్లు దాఖలు
క్విడ్‌ప్రోకో కేసులో సీబీఐ మంగళవారం మూడు  చార్జ్షీట్లు దాఖలు చేసింది. పెన్నా సిమెంట్స్, ఇండియా సిమెంట్స్, భారతి సిమెంట్స్కు సంబంధించిన ఈ మూడు చార్జ్షీటులు వేసింది. నాంపల్లి సీబీఐ కోర్టు న్యాయమూర్తి సెలవులో ఉన్నందున... సీబీఐ ఈ  ఛార్జ్షీటులను గగన్ విహార్లోని సీబీఐ కోర్టులో దాఖలు చేసింది.

వైఎస్ జగన్మోహన్ రెడ్డి కేసులకు సంబంధించి సీబీఐకి సుప్రీంకోర్టు ఇచ్చిన గడువు ఈ నెల 8వ తేదీతో ముగిసింది. అయితే ఎనిమిది, తొమ్మిది తేదీలు సెలవులు కావటంతో సీబీఐ అధికారులు నేడు చార్జ్షీటు దాఖలు చేశారు. ఈ కేసులో ఇప్పటివరకూ సీబీఐ అయిదు చార్జ్ షీట్లు దాఖలు చేసింది. కాగా సీబీఐ డిఐజి వెంకటేశ్‌ కూడా కోర్టుకు హాజరయ్యారు. ఇక జగన్మోహన్ రెడ్డి 15 నెలలుగా జైల్లో ఉన్నారు.
 
Share this article :

0 comments: