వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి త్వరలోనే బెయిల్ పై విడుదల అవుతారని నెల్లూరు ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి అన్నారు. న్యాయవ్యవస్థపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పూర్తి నమ్మకం ఉంది అని మేకపాటి వ్యాఖ్యానించారు. వచ్చే సార్వత్రిక ఎన్నికలు సమైక్యరాష్ట్రంలోనే జరుగుతాయని తాము భావిస్తున్నామని ఆయన మీడియాతో అన్నారు.
సమైక్య రాష్ట్రంలోనే వైఎస్ జగన్ ముఖ్యమంత్రి పదవిని చేపడుతారని మేకపాటి ధీమా వ్యక్తం చేశారు. సార్వత్రిక ఎన్నికల అనంతరం దేశ రాజకీయాల్లో జగన్ కీలక పాత్ర పోషిస్తారు అని ఎంపీ మేకపాటి రాజమోహన్రెడ్డి విశ్వాసం వ్యక్తం చేశారు.
0 comments:
Post a Comment