కాంగ్రెస్ పార్టీతో ఒప్పందం కుదుర్చుకుంది మీరా... మేమా? - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » కాంగ్రెస్ పార్టీతో ఒప్పందం కుదుర్చుకుంది మీరా... మేమా?

కాంగ్రెస్ పార్టీతో ఒప్పందం కుదుర్చుకుంది మీరా... మేమా?

Written By news on Saturday, September 14, 2013 | 9/14/2013

చితిమంటలపై చలికాచుకుంటున్న చంద్రబాబు

 తెలుగుదేశంపార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, ఎమ్మెల్యే శోభానాగిరెడ్డి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. చంద్రబాబు న్యూఢిల్లీ యాత్ర ఎందుకో ప్రజలకు వివరించాలని శోభానాగిరెడ్డి డిమాండ్ చేశారు. తమ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ బెయిల్ ను అడ్డుకునేందుకా లేక గతంలో తెలంగాణ అనుకూలంగా ఇచ్చిన లేఖ సరైనదే అని చెప్పుకోవడానికా అని చంద్రబాబును శోభానాగిరెడ్డి ప్రశ్నించారు.
 
సమైక్యాంధ్రకు మద్దతుగా సీమాంధ్రలో ఉద్యమం అట్టుడుకుతుంటే తెలుగుదేశం పార్టీ గొప్పలకుపోతోందని ఎద్దేవా చేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో 30 లోక్ సభ సీట్లు గెలుస్తామని చెబుతున్న టీడీపీని చూసి రాష్ట్ర ప్రజలు అసహ్యించుకుంటున్నారని తెలిపారు. మీకేమైనా కోపం ఉంటే తమపై చూపాలని, అంతేకాని రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టొద్దని చంద్రబాబుకు ఈ సందర్భంగా శోభానాగిరెడ్డి హితవు పలికారు.
 
కాంగ్రెస్ పార్టీతో ఒప్పందం కుదుర్చుకుంది మీరా... మేమా అని ఆమె ప్రశ్నించారు. జగన్ బయటకు వస్తున్నారంటే మీకు ఎందుకంత భయం పట్టుకుంటుందో అర్థంకావడం లేదని అన్నారు. చంద్రబాబుకు మతిభ్రమించి మాట్లాడుతున్నారని అన్నారు. ఇలాగే వ్యవహారిస్తే భవిష్యత్ లో ఆ పార్టీకి ప్రతిపక్ష హోదా కూడా దక్కదని అన్నారు. కాంగ్రెస్, టీడీపీలకు వాతలు పెట్టడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని శోభానాగిరెడ్డి అన్నారు.  
 
Share this article :

0 comments: