ఈనెల 30న కుప్పంలో సమైక్యశంఖారావం - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » ఈనెల 30న కుప్పంలో సమైక్యశంఖారావం

ఈనెల 30న కుప్పంలో సమైక్యశంఖారావం

Written By news on Thursday, November 28, 2013 | 11/28/2013

ఈనెల 30న కుప్పంలో సమైక్యశంఖారావం
హైదరాబాద్: ఈ నెల 30వ తేదీన చిత్తూరు జిల్లా కుప్పంలో సమైక్య శంఖారావం నిర్వహిస్తున్నట్లు వైఎస్సార్ సీపీ ప్రకటించింది. అక్కడ ఏర్పాటు చేయనున్నబహిరంగ సభలో సమైక్యాంధ్రప్రదేశ్ ను ఉద్దేశించి వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహనరెడ్డి ప్రసంగించనున్నారు. మధ్యాహ్నం 12 గం.లకు చిత్తూరు జిల్లాలోకి జగన్ ప్రవేశించనున్న జగన్..ఓదార్పు కుటుంబాలను కలుస్తారు. అనంతరం మధ్యాహ్నం 2.గం.లకు కుప్పంలో బహిరంగ సభలో జగన్ ప్రసంగిస్తారు.

కుప్పం వస్తున్న వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి స్వాగత ఏర్పాట్లు చేపట్టేందుకు వైఎస్‌ఆర్ సీపీ కార్యకర్తలు సిద్ధమవుతున్నారు. తొలుత ఆయన బెంగళూరు నుంచి కుప్పం చేరుకుంటారు. దీనికి సంబంధించి బుధవారం పార్టీ కా ర్యకర్తలు సమావేశమయ్యారు. జగన్‌మోహన్‌రెడ్డి పర్యటన ఏర్పాట్లపై వీరు సమీక్షించారు. తొలిరోజున కుప్పం నియోజకవర్గంలోని పైపాళ్యంలో వెంకటేష్ కుటుంబానికి ఓదార్పునిస్తారు. తర్వాత ఎనగాంపల్లె, తంబిగానిపల్లెలో దివంగత నేత వైఎస్.రాజశేఖర రెడ్డి విగ్రహాలను ఆవిష్కరిస్తారు. కుప్పంలో సమైక్య శంఖారావం సభలో ప్రసంగిస్తారు. తరువాత కంచిబదార్లపల్లెలో లక్ష్మి కుటుంబానికి ఓదార్పునిస్తారు. అనంతరం పలమనేరుకు వెళతారు.
 
Share this article :

0 comments: