సన్నాసులు సవాల్‌ విసరడం దిగజారుడుతనం - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » సన్నాసులు సవాల్‌ విసరడం దిగజారుడుతనం

సన్నాసులు సవాల్‌ విసరడం దిగజారుడుతనం

Written By news on Sunday, November 24, 2013 | 11/24/2013

'సన్నాసులు సవాల్‌ విసరడం దిగజారుడుతనం'
హైదరాబాద్: సోనియా గాంధీతో వైఎస్ జగన్ కుమ్మక్కయ్యారని టీడీపీ ఎంపీ సీఎం రమేష్ ఆరోపించడం దిగజారుడుతనమని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్‌రెడ్డి విమర్శించారు. డబ్బులిచ్చి రాజ్యసభకు వెళ్లిన సీఎం రమేష్‌కు వైఎస్ జగన్‌పై ఆరోపణలు చేసే స్థాయి లేదన్నారు. కల్తీ సారా తయారీదారుడైన సీఎం రమేష్‌ రాజకీయ సన్యాసం చేయడానికి ఏముందని ప్రశ్నించారు. సన్నాసులు సవాల్‌ విసరడం రాజకీయ దిగజారుడుతనమన్నారు.

చిత్తూరు తాగునీటి పథకంలో భారీ కుంభకోణం జరుగుతోందని భూమన ఆరోపించారు. కండలేరు నుంచి 6.1 టీఎంసీల నీటిని తరలించే ఈ పథకానికి భారీగా అంచనాలు పెంచేశారని తెలిపారు. రూ.2,500 కోట్లతో అయ్యే ప్రాజెక్ట్ అంచనాను రూ.5,300 కోట్లకు పెంచి చూపిస్తున్నారని అన్నారు. ఇందులో రూ.600 కోట్లను సీఎం కిరణ్‌ దోచుకోవడానికి ప్రణాళిక రూపొందించారని ఆరోపించారు.

సీఎం తమ్ముడు సంతోష్‌రెడ్డి దళారిగా వ్యవహరిస్తున్నారని అన్నారు. నెల్లూరు కాంట్రాక్టర్ సుధీర్‌రెడ్డితో మొత్తం వ్యవహారాన్ని నడిపించి అక్రమాలకు పాల్పడుతున్నారని చెప్పారు. చిత్తూరు తాగునీటి కుంభకోణంపై తక్షణమే సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని భూమన డిమాండ్ చేశారు. టీచర్ల బదిలీలకు కూడా సీఎం కార్యాలయం రూ.లక్ష లంచం తీసుకుంటోందని ఆయన ఆరోపించారు.
Share this article :

0 comments: