చిత్తూరు తాగునీటి పథకంలో భారీ కుంభకోణం జరుగుతోందని భూమన ఆరోపించారు. కండలేరు నుంచి 6.1 టీఎంసీల నీటిని తరలించే ఈ పథకానికి భారీగా అంచనాలు పెంచేశారని తెలిపారు. రూ.2,500 కోట్లతో అయ్యే ప్రాజెక్ట్ అంచనాను రూ.5,300 కోట్లకు పెంచి చూపిస్తున్నారని అన్నారు. ఇందులో రూ.600 కోట్లను సీఎం కిరణ్ దోచుకోవడానికి ప్రణాళిక రూపొందించారని ఆరోపించారు.
సీఎం తమ్ముడు సంతోష్రెడ్డి దళారిగా వ్యవహరిస్తున్నారని అన్నారు. నెల్లూరు కాంట్రాక్టర్ సుధీర్రెడ్డితో మొత్తం వ్యవహారాన్ని నడిపించి అక్రమాలకు పాల్పడుతున్నారని చెప్పారు. చిత్తూరు తాగునీటి కుంభకోణంపై తక్షణమే సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని భూమన డిమాండ్ చేశారు. టీచర్ల బదిలీలకు కూడా సీఎం కార్యాలయం రూ.లక్ష లంచం తీసుకుంటోందని ఆయన ఆరోపించారు.
0 comments:
Post a Comment