పంట నష్టపోయిన రైతులకు జగన్ పరామర్శ - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » పంట నష్టపోయిన రైతులకు జగన్ పరామర్శ

పంట నష్టపోయిన రైతులకు జగన్ పరామర్శ

Written By news on Tuesday, November 26, 2013 | 11/26/2013

పంట నష్టపోయిన రైతులకు జగన్ పరామర్శ
కాకినాడ : హెలెన్ తుపాన్‌ దెబ్బకు తీవ్రంగా నష్టపోయిన రైతులను వైఎస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్ రెడ్డి మంగళవారం పరామర్శించారు.  తూర్పు గోదావరి జిల్లా..కొత్తపేట నియోజకవర్గం..అవిడిలో ఆయన పంట నష్టపోయిన రైతులను కలుసుకుని వారి కష్టాలు విన్నారు.  తన అయిదు  ఎకరాలు పంట నీటిపాలైందని ఓ వృద్ధ రైతు  వైఎస్‌ జగన్‌ దగ్గర ఆవేదన వ్యక్తం చేశారు.  

 వైఎస్ఆర్‌ ఉన్నప్పుడు నష్టపరిహారం రూపంలో ఒక దారి చూపించేవారని ఈ  ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోలేదని రైతులు వాపోయారు.  వ్యవసాయం గిట్టుబాటు కావడంలేదని ఆవేదయ వ్యక్తం చేశారు.  తుపాన్‌ దెబ్బకు వేల ఎకరాల్లో అరటి తోటలు, లక్షల ఎకరాల్లో వరి  దెబ్బతిన్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. హెలెన్‌ తుపాన్‌ దెబ్బకు విరిగిపడిన అరటి చెట్లను..గెలలను వారు జగన్ కు చూపించారు
Share this article :

0 comments: