ఢిల్లీ చేరుకున్న వైఎస్ జగన్ - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » ఢిల్లీ చేరుకున్న వైఎస్ జగన్

ఢిల్లీ చేరుకున్న వైఎస్ జగన్

Written By news on Friday, November 15, 2013 | 11/15/2013

ఢిల్లీ చేరుకున్న వైఎస్ జగన్
న్యూఢిల్లీ: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి శుక్రవారం రాత్రి 10 గంటల ప్రాంతంలో న్యూఢిల్లీ చేరుకున్నారు. రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా ఆయన దేశ రాజధానిలో గళం వినిపించనున్నారు. ఇందులో భాగంగా పలు రాజకీయ పార్టీ నాయకులను ఆయన కలుస్తారు. విభజన వల్ల తలెత్తె విపరిణామాలను వివరిస్తారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచేందుకు సహకరించాలని కోరనున్నారు.

సమైక్యమే తమ ఎజెండా అని వైఎస్ జగన్ తెలిపారు. రేపు (శనివారం) కమ్యూనిస్టు పార్టీ నాయకులను కలవనున్నట్టు ఆయన వెల్లడించారు. ఎల్లుండి బీజేపీ అగ్ర నాయకత్వంతో సమావేశమవుతానని చెప్పారు. సమైక్యాంధ్రకు మద్దతు కోరతానని తెలిపారు. కాగా, కోర్టు అనుమతి వచ్చాక ఇతర రాష్ట్రాలకు వెళ్లి ఆయా పార్టీల నేతలను జగన్ కలుస్తారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత మైసూరా రెడ్డి వెల్లడించారు.
Share this article :

0 comments: