బొత్స సన్నిహిత ఎమ్మెల్యే కూడా.. జగన్ సమక్షంలో పార్టీలోకి సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్కు చెందిన ఒక ఎమ్మెల్యే, మరో ఎమ్మెల్సీ గురువారం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. పలు ప్రాంతాల నుంచి వచ్చిన కార్యకర్తలు, నేతలు కూడా పార్టీలో చేరారు. వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి తన క్యాంపు కార్యాలయంలో వీరందరికీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. పీసీసీ మాజీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణకు సన్నిహితుడైన కాంగ్రెస్ ఎమ్మెల్యే మీసాల నీలకంఠం నాయుడు(ఎచ్చెర్ల) గురువారం వైఎస్సార్సీపీలో చేరారు. మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు నీలకంఠంను వెంట బెట్టుకుని వచ్చి జగన్ సమక్షంలో పార్టీలో చేర్చారు. విశాఖపట్టణం స్థానిక సంస్థల నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న కాంగ్రెస్ ఎమ్మెల్సీ డి.వి.సూర్యనారాయణరాజు కూడా పార్టీలో చేరారు.
తంగేడు రాజుల కుటుంబానికి చెందిన వైఎస్సార్సీపీ నేతలు రాజా సాగి సీతారామరాజు, రాజా సాగి రామభద్రరాజు(ఏటికొప్పాక చక్కెర ఫ్యాక్టరీ మాజీ చైర్మన్)లు కలసి సూర్యనారాయణరాజును తోడ్కొని జగన్ వద్దకు వచ్చారు. ఆయనతో పాటు ఆ ప్రాంతానికి చెందిన పలువురు నేతలకు కూడా జగన్ కండువాలు కప్పి పార్టీలోకి చేర్చుకున్నారు. మరోవైపు ఇప్పటికే పార్టీలో చేరిన విశాఖపట్టణం(పశ్చిమ) ఎమ్మెల్యే మళ్ల విజయప్రసాద్ ఆధ్వర్యంలో నియోజకవర్గానికి చెందిన నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో వైఎస్సార్సీపీలోకి చేరారు. నెల్లూరు జిల్లా కావలికి చెందిన అల్లూరు మాజీ ఎమ్మెల్యే విష్ణువర్దన్రెడ్డి కూడా 100 మందికిపైగా కార్యకర్తలు, నేతలతో కలిసి వైఎస్ జగన్మోహన్రెడ్డి సమక్షంలో పార్టీలోకి చేరారు.
వైఎస్సార్సీపీలోకి కర్నూలు నేతలు: మాజీ ఎమ్మెల్సీ ఎస్.వి.మోహన్రెడ్డి ఆధ్వర్యంలో కర్నూలుకు చెందిన మహ్మద్ పాషా(రాష్ట్ర వక్ఫ్బోర్డు సభ్యుడు) ఎస్.చాంద్పాషా(జిల్లా వక్ఫ్బోర్డు చైర్మన్), అక్బర్ సాహెబ్ (జిల్లా వక్ఫ్ కమిటీ సభ్యుడు), హెచ్.కె.మనోహర్ (జిల్లా బ్రాహ్మణ సంఘం కార్యదర్శి), మైనారిటీ నేత అమీరుద్దీన్ గురువారం జగన్ క్యాంపు కార్యాలయానికి వచ్చి ఆయన సమక్షంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు.
పార్టీలో చేరిన ఇల్లెందు నేత: ఖమ్మం జిల్లా ఇల్లెందు అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన డాక్టర్ రవిబాబు నాయక్.. జగన్ సమక్షంలో వైఎస్సార్సీపీలో చేరారు. ఖమ్మం లోక్సభ నియోజకవర్గం వైఎస్సార్సీపీ అభ్యర్థి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆయన్ను పార్టీలో చేర్చారు.
తంగేడు రాజుల కుటుంబానికి చెందిన వైఎస్సార్సీపీ నేతలు రాజా సాగి సీతారామరాజు, రాజా సాగి రామభద్రరాజు(ఏటికొప్పాక చక్కెర ఫ్యాక్టరీ మాజీ చైర్మన్)లు కలసి సూర్యనారాయణరాజును తోడ్కొని జగన్ వద్దకు వచ్చారు. ఆయనతో పాటు ఆ ప్రాంతానికి చెందిన పలువురు నేతలకు కూడా జగన్ కండువాలు కప్పి పార్టీలోకి చేర్చుకున్నారు. మరోవైపు ఇప్పటికే పార్టీలో చేరిన విశాఖపట్టణం(పశ్చిమ) ఎమ్మెల్యే మళ్ల విజయప్రసాద్ ఆధ్వర్యంలో నియోజకవర్గానికి చెందిన నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో వైఎస్సార్సీపీలోకి చేరారు. నెల్లూరు జిల్లా కావలికి చెందిన అల్లూరు మాజీ ఎమ్మెల్యే విష్ణువర్దన్రెడ్డి కూడా 100 మందికిపైగా కార్యకర్తలు, నేతలతో కలిసి వైఎస్ జగన్మోహన్రెడ్డి సమక్షంలో పార్టీలోకి చేరారు.
వైఎస్సార్సీపీలోకి కర్నూలు నేతలు: మాజీ ఎమ్మెల్సీ ఎస్.వి.మోహన్రెడ్డి ఆధ్వర్యంలో కర్నూలుకు చెందిన మహ్మద్ పాషా(రాష్ట్ర వక్ఫ్బోర్డు సభ్యుడు) ఎస్.చాంద్పాషా(జిల్లా వక్ఫ్బోర్డు చైర్మన్), అక్బర్ సాహెబ్ (జిల్లా వక్ఫ్ కమిటీ సభ్యుడు), హెచ్.కె.మనోహర్ (జిల్లా బ్రాహ్మణ సంఘం కార్యదర్శి), మైనారిటీ నేత అమీరుద్దీన్ గురువారం జగన్ క్యాంపు కార్యాలయానికి వచ్చి ఆయన సమక్షంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు.
పార్టీలో చేరిన ఇల్లెందు నేత: ఖమ్మం జిల్లా ఇల్లెందు అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన డాక్టర్ రవిబాబు నాయక్.. జగన్ సమక్షంలో వైఎస్సార్సీపీలో చేరారు. ఖమ్మం లోక్సభ నియోజకవర్గం వైఎస్సార్సీపీ అభ్యర్థి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆయన్ను పార్టీలో చేర్చారు.
0 comments:
Post a Comment