మీ పాలనపై ప్రజలకు ఎందుకు చెప్పరు - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » మీ పాలనపై ప్రజలకు ఎందుకు చెప్పరు

మీ పాలనపై ప్రజలకు ఎందుకు చెప్పరు

Written By news on Thursday, March 13, 2014 | 3/13/2014

మీ పాలనపై ప్రజలకు ఎందుకు చెప్పరు
హైదరాబాద్:టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుపై వైఎస్సార్ సీపీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ మండిపడ్డారు. చంద్రబాబు నాయుడు తన తొమ్మిదేళ్ల పాలన గురించి చెప్పకుండా ఎన్టీఆర్ పాలన తెస్తామంటూ ప్రచారం చేస్తుండాన్ని ఆమె తప్పుబట్టారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబుకు తన తొమ్మిది సంవత్సరాల పాలన తిరిగి తెస్తానని చెప్పే దమ్ము లేకనే ఎన్టీఆర్ పాలన అంటూ కొత్త రాగం అందుకున్నారని విమర్శించారు. కిరణ, చంద్రబాబులు నవయువకుల్లా యువకుల వెంటపడగతున్నారని ఎద్దేవా చేశారు. అసలు యువతకు ఏంచేశారని పద్మ మండిపడ్డారు.
 
కడప ఉప ఎన్నికల్లో బీజేపీతో జగన్ పొత్తు పెట్టుకుంటారని దుష్ప్రచారం చేసిన బాబుకు ఆవిషయం మరిచిపోయి బీజేపీతో పొత్తుకు వెంపర్లాడుతున్నారన్నారు.ఎవరెన్నిక కుట్రలు చేసినా జగన్ ప్రభంజనాన్ని ఆపలేరన్నారు.కొత్తగా పుట్టుకొస్తున్న పార్టీల వెనక ఎవరున్నారన్నది వైఎస్‌ఆర్‌సీపీ నిగ్గుతేలుస్తుందని తెలిపారు. కిరణ్ అధికారంలో ఉన్నప్పుడు ఏం చేశారని ఇప్పుడు మళ్లీ అధికారం ఇవ్వాలని అడుగుతున్నారని ప్రశ్నించారు.
Share this article :

0 comments: