సర్వేల పేరుతో టీడీపీ మోసం - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » సర్వేల పేరుతో టీడీపీ మోసం

సర్వేల పేరుతో టీడీపీ మోసం

Written By news on Friday, March 14, 2014 | 3/14/2014

రాష్ట్రాన్ని అభివృద్ధి చేసిన వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రతినిధులుగా ఓటు అడిగే హక్కు తమకే ఉందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత వల్లభనేని బాలశౌరి అన్నారు. రాష్ట్ర విభజనకు లేఖ ఇచ్చిన టీడీపీకి ఎన్నికల్లో ఓటు వేయమని అడిగే హక్కు లేదని ఆయన వ్యాఖ్యానించారు. విభజనకు సహకరించిన చంద్రబాబు నాయుడు కుట్రను ఊరూరా ప్రచారం చేస్తామని బాలశౌరి తెలిపారు.
సర్వేల పేరుతో టీడీపీ ప్రజలను మోసం చేస్తోందని ఆయన అన్నారు. సర్వలతో తనకు సంబంధం లేదని లగడపాటి రాజగోపాల్ తనతో చెప్పారని బాలశౌరి పేర్కొన్నారు. వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేయటమే వైఎస్ఆర్ సీపీ కార్యకర్తలు లక్ష్యంగా పెట్టుకున్నారని అన్నారు. కాగా ఇటీవల లగడపాటి రాజగోపాల్ నిర్వహించిన సర్వేల్లో టీడీపీ ముందంజలో ఉన్నట్లు వార్తలు వెలువడిన విషయం తెలిసిందే
Share this article :

0 comments: