‘పశ్చిమ’లో వైసీపీకి జనసేన నాయకుల మద్దతు - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » ‘పశ్చిమ’లో వైసీపీకి జనసేన నాయకుల మద్దతు

‘పశ్చిమ’లో వైసీపీకి జనసేన నాయకుల మద్దతు

Written By news on Monday, May 5, 2014 | 5/05/2014

‘పశ్చిమ’లో వైసీపీకి జనసేన నాయకుల మద్దతు
తాడేపల్లిగూడెం: పశ్చిమ గోదావరి జిల్లాలో జనసేన పార్టీ నాయకులు, కార్యాకర్తలు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి మద్దతు ప్రకటిస్తున్నారు. వారు వైసీపీ అభ్యర్థుల తరఫున ప్రచారం చేస్తున్నారు. నరసాపురం, తణుకు, నిడదవోలు, కొవ్వూరు, భీమవరం నియోజకవర్గాల్లోని జనసేన కార్యకర్తలు రెండు రోజు లుగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల తరఫున ప్రచారం చేస్తుండగా ఆది వారం తాడేపల్లిగూడెం నియోజకవర్గంలోని ఆ పార్టీ కార్యకర్తలు అదే బాట పట్టారు. వైసీపీకి మద్దతుగా జనసేన, పవన్ కల్యాణ్ యూత్ అసోసియేషన్లు ఆదివారం పట్టణంలో భారీ మోటారు సైకిళ్ల ర్యాలీని నిర్వహించాయి.

ప్రజోపయోగ కార్యక్రమాలు నిర్వహించగల సత్తా ఉన్న నాయకునికి మద్దతునివ్వాలని అసోసియేషన్ల సర్వసభ్య సమావేశంలో తీసుకున్న నిర్ణయం మేరకు ఈ ర్యాలీ నిర్వహించినట్టు ఫ్యాన్స్ సభ్యులు తెలిపారు. ప్రజాసేవ చేయగల సత్తా ఉన్న నాయకునిగా తోట గోపిని గుర్తించి ఆ మేరకు మద్దతు ఇస్తున్నట్టు చెప్పారు. ర్యాలీలో మెగా బ్రదర్స్, మెగా ఫ్రెండ్స్, నిమ్మకాయల యూత్, సవితృపేట యూత్, జగన్నాథపురం యూత్, తాడేపల్లిగూడెం తాలూకా, పట్టణ పవన్ కల్యాణ్ ఫాన్స్, జనసేన సభ్యులు ర్యాలీలో పాల్గొన్నారు.
Share this article :

0 comments: