కనీసం 24 గంటలు పరిశీలనలో ఉండాలి - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » కనీసం 24 గంటలు పరిశీలనలో ఉండాలి

కనీసం 24 గంటలు పరిశీలనలో ఉండాలి

Written By news on Tuesday, October 13, 2015 | 10/13/2015


కనీసం 24 గంటలు పరిశీలనలో ఉండాలి
గుంటూరు : ఏడు రోజుల పాటు నిరవధిక నిరాహార దీక్ష చేసిన వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కనీసం 24 గంటల పాటు తమ అబ్జర్వేషన్ లో ఉండాలని గుంటూరు ప్రభుత్వాస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రాజునాయుడు తెలిపారు. వైఎస్ జగన్ ను ఆస్పత్రిలో చేర్చి, చికిత్స అందించడం ప్రారంభించిన తర్వాత ఆయన ఆరోగ్యం గురించి డాక్టర్ రాజు నాయుడు మీడియాతో మాట్లాడారు. ఆయన చెప్పిన వివరాలు ఇలా ఉన్నాయి...
  • వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఉదయం 4.30 గంటల సమయంలో ఆస్పత్రిలో చేరారు.
  • తీసుకొచ్చేసరికి ఆయన డీహైడ్రేషన్ లో ఉన్నారు,
  • బీపీ130/90, పల్స్ 56 ఉన్నాయి.
  • షుగర్ 65 ఉంది. కీటోన్స్ 4+ వచ్చింది.
  • రక్తపరీక్షలు, మూత్రపరీక్షలు, గుండెకు సంబంధించిన పరీక్షలు చేశాం.
  • కిడ్నీకి సంబంధించి బ్లడ్ యూరియా, సీరమ్ క్రియాటిన్ నార్మల్ గా ఉన్నాయి.
  • సీరమ్ యూరిక్ యాసిడ్ మాత్రం ఎక్కువగా ఉంది.
  • గుండె పరిస్థితి గురించి తెలుసుకోడానికి ఈసీజీ కూడా చేశారు.
  • ఈ పరీక్షల ఆధారంగా ఆయనకు ఐవీ ఫ్లూయిడ్స్ అందిస్తున్నాం.
  • ఆయన పరిస్థితి స్టేబుల్ గా ఉంది.
  • కనీసం 24 గంటలు మా అబ్జర్వేషన్ లో ఉంచాలన్నది మా డాక్టర్లందరి నిర్ణయం.
  • ఆయనకు విశ్రాంతి చాలా అవసరం.
  • ఐవీ ఫ్లూయిడ్స్ తో పాటు జ్యూసులు ఇవ్వాలని చెప్పాం.
  • యూరిక్ యాసిడ్, కీటోన్ బాడీస్ తప్ప మిగిలినవన్నీ సాధారణ స్థితిలోనే ఉన్నాయని చెప్పొచ్చు.
Share this article :

0 comments: