హుటాహుటిన గుంటూరు బయల్దేరిన వైఎస్ విజయమ్మ - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » హుటాహుటిన గుంటూరు బయల్దేరిన వైఎస్ విజయమ్మ

హుటాహుటిన గుంటూరు బయల్దేరిన వైఎస్ విజయమ్మ

Written By news on Monday, October 12, 2015 | 10/12/2015

ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ నిరవధిక నిరాహార దీక్ష చేపట్టిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆరోగ్యం మరింత క్షీణిస్తుండంతో కుటుంబ సభ్యులు హుటాహుటీన గుంటూరుకు బయల్దేరారు.

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ, ఇతర కుటుంబ సభ్యులు సోమవారం మధ్యాహ్నం హైదరాబాద్ నుంచి గుంటూరుకు పయనమయ్యారు. ఇంతకుముందు వైఎస్ విజయమ్మ, వైఎస్ జగన్ సతీమణి వైఎస్ భారతి.. వైఎస్ జగన్ ను పరామర్శించిన సంగతి తెలిసిందే.
 
కాగా వైఎస్ జగన్ ఆరోగ్యంపై ఆందోళన వ్యక్తమవుతున్న నేపథ్యంలో కుటుంబ సభ్యులతో కలిసి వైఎస్ విజయమ్మ  మళ్లీ గుంటూరు వెళ్లారు. గుంటూరు జిల్లా నల్లపాడు రోడ్డులో వైఎస్ జగన్ చేస్తున్న దీక్ష ఆరో రోజుకు చేరుకుంది. ఈ రోజు మధ్యాహ్నం మరోసారి జీజీహెచ్ వైద్యులు వైఎస్ జగన్ కు వైద్య పరీక్షలు నిర్వహించారు.
Share this article :

0 comments: