గుంటూరు : వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ని ఆయన భార్య వైఎస్ భారతి పరామర్శించారు. ఆదివారం గుంటూరు నగర శివారు నల్లపాడు రోడ్డులోని వైఎస్ జగన్ దీక్షా శిబిరాన్ని సందర్శించారు. వైఎస్ భారతి వేదిక పై కూర్చుని వైఎస్ జగన్ ఆరోగ్యం గురించి అడిగి తెలుసుకున్నారు.
ఆంధ్రప్రదేశ్ కి ప్రత్యేక హోదా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ వైఎస్ జగన్ నిరవధిక నిరాహారదీక్షను చేపట్టిన సంగతి తెలిసిందే. ఆదివారంతో ఆయన దీక్ష చేపట్టి ఐదో రోజుకు చేరుకుంది. ఈ రోజు వైఎస్ జగన్ ను పరీక్షించిన గుంటూరు జీజీహెచ్ వైద్యులు ఆరోగ్య పరిస్థితి క్షీణిస్తోందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
0 comments:
Post a Comment