ఐసీయూలోకి తరలించి.. - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » ఐసీయూలోకి తరలించి..

ఐసీయూలోకి తరలించి..

Written By news on Tuesday, October 13, 2015 | 10/13/2015


ఐసీయూలో వైఎస్ జగన్
గుంటూరు: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రస్తుతం ఐసీయూలో ఉన్నారు. నల్లపాడు రోడ్డులోని దీక్షా స్థలి నుంచి బలవంతంగా తమ అదుపులోకి తీసుకున్న పోలీసులు వెంటనే ఆయనను గుంటూరు జీజేహెచ్ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అందులోని ఐసీయూలోకి తరలించి వెంటవెంటనే పరీక్షలు ప్రారంభించారు.

ఈ సందర్భంగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కుటుంబ సభ్యులు గుంటూరు ప్రభుత్వాస్పత్రి వద్దకు వచ్చారు. తల్లి వైఎస్ విజయమ్మ, భార్య వైఎస్ భారతి, సోదరి వైస్ షర్మిల ప్రస్తుతం ఆయనతోపాటే ఐసీయూలో ఉండి పరామర్శిస్తున్నారు. 

వైఎస్ జగన్ దీక్షను భగ్నం చేసిన పోలీసులు
ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా కోసం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేస్తున్న నిరవధిక నిరాహార దీక్షను పోలీసులు భగ్నం చేశారు. సరిగ్గా 4 గంటల ప్రాంతంలో దీక్షా స్థలికి వచ్చిన పోలీసులు 4.11 గంటలకు వైఎస్ జగన్ తో తొలుత మంతనాలు జరిపే ప్రయత్నం చేసి వెంటనే దీక్షను భగ్నం చేశారు. బలవంతంగా ఆయనను దీక్షా స్థలినుంచి ఎత్తుకెళ్లారు. ప్రత్యేక హోదా వచ్చే వరకు తాను దీక్ష విరమించబోనని, తన నిరాహార దీక్షను ఆపలేరని, శాంతియుతంగానే తాను దీక్ష చేస్తున్నాను తప్ప ఎవరికీ ఎలాంటి హానీ చేయడం లేదని చెప్పినా పోలీసులు ఆయన మాట వినలేదు.

మరోపక్క, పోలీసులు భారీ సంఖ్యలో రావడంతో అక్కడే ఉన్న పార్టీ ముఖ్యనాయకులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మద్దతుదారులు,  సామాన్య ప్రజానీకం పోలీసులను అడ్డుకునే ప్రయత్నం చేసినా వారిపై లాఠీ చార్జి జరిపి మరి పోలీసులు వైఎస్ జగన్ ను 108 ద్వారా ఆస్పత్రికి తరలించారు.
Share this article :

0 comments: