గుంటూరు: ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా ఇవ్వాలనే డిమాండ్ తో నిరవధిక నిరాహార దీక్ష చేస్తున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆరోగ్యం క్షీణిస్తోంది. వైఎస్ జగన్ దీక్ష ఐదో రోజుకు చేరుకుంది. ఆదివారం ఉదయం వైద్యులు వైఎస్ జగన్ కు వైద్య పరీక్షలు చేశారు.
వైఎస్ జగన్ బరువు తగ్గి బాగా నీరసించిపోయారు. షుగర్ లెవల్స్ పడిపోయాయి. వైఎస్ జగన్ ఆరోగ్యంపై వైద్యులు ఆందోళన వ్యక్తం చేశారు. బీపీ 110/70, పల్స్ రేట్ 66 ఉన్నట్టు వైద్యులు చెప్పారు. ఈ రోజు మధ్యాహ్నం వైఎస్ జగన్ కు మరోసారి వైద్య పరీక్షలు నిర్వహించనున్నారు. వైఎస్ జగన్ ఆరోగ్యంపై అభిమానులు, కార్యకర్తలు ఆందోళన చెందుతున్నారు.
వైఎస్ జగన్ బరువు తగ్గి బాగా నీరసించిపోయారు. షుగర్ లెవల్స్ పడిపోయాయి. వైఎస్ జగన్ ఆరోగ్యంపై వైద్యులు ఆందోళన వ్యక్తం చేశారు. బీపీ 110/70, పల్స్ రేట్ 66 ఉన్నట్టు వైద్యులు చెప్పారు. ఈ రోజు మధ్యాహ్నం వైఎస్ జగన్ కు మరోసారి వైద్య పరీక్షలు నిర్వహించనున్నారు. వైఎస్ జగన్ ఆరోగ్యంపై అభిమానులు, కార్యకర్తలు ఆందోళన చెందుతున్నారు.
0 comments:
Post a Comment