ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఏపీ అసెంబ్లీ ప్రతిపక్షనేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి లేఖ రాశారు. ఈనెల 22వ తేదీన అమరావతి రాజధాని శంకుస్థాపనకు వస్తున్న సందర్భంగా కలిసేందుకు అవకాశం ఇవ్వాలని ఆ లేఖలో కోరారు. పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలతో కలిసి వస్తానని, తమకు అపాయింట్ మెంట్ ఇవ్వాలని ఆ లేఖలో వైఎస్ జగన్ కోరారు.
రాష్ట్రానికి ప్రత్యేక హోదా వచ్చేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నామని, గతంలో ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద ధర్నా చేశామని, తాజాగా గుంటూరులో నిరవధిక నిరాహారదీక్ష చేశానని చెప్పారు. అయితే తన దీక్షను ప్రభుత్వం భగ్నం చేసిందన్నారు. ప్రజల ఆకాంక్షలను నెరవేర్చేందుకు తమవంతు ప్రయత్నాలు చేస్తూనే ఉంటామని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ కు వస్తున్న సందర్భంగా కలిసేందుకు అపాయింట్ మెంట్ కోరతున్నామన్నారు. ప్రత్యేక హోదాపై ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలతో కలిసి వినతిపత్రం అందిస్తామన్నారు. గన్నవరం లేదా తిరుపతిలో కలిసేందుకు అపాయింట్ మెంట్ ఇవ్వాలని ఆ లేఖలో కోరారు.
రాష్ట్రానికి ప్రత్యేక హోదా వచ్చేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నామని, గతంలో ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద ధర్నా చేశామని, తాజాగా గుంటూరులో నిరవధిక నిరాహారదీక్ష చేశానని చెప్పారు. అయితే తన దీక్షను ప్రభుత్వం భగ్నం చేసిందన్నారు. ప్రజల ఆకాంక్షలను నెరవేర్చేందుకు తమవంతు ప్రయత్నాలు చేస్తూనే ఉంటామని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ కు వస్తున్న సందర్భంగా కలిసేందుకు అపాయింట్ మెంట్ కోరతున్నామన్నారు. ప్రత్యేక హోదాపై ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలతో కలిసి వినతిపత్రం అందిస్తామన్నారు. గన్నవరం లేదా తిరుపతిలో కలిసేందుకు అపాయింట్ మెంట్ ఇవ్వాలని ఆ లేఖలో కోరారు.
0 comments:
Post a Comment