జగన్, కిరణ్ కుమార్ రెడ్డి, చంద్రబాబు నాయుడు, కేసీఆర్.. ఈ నలుగురు నాయకులలో భారతదేశంలో ఉన్న నెటిజన్లు ఎక్కువగా ఎవరిపేరు సెర్చ్ చేస్తున్నారో చూస్తే, అందరి కంటే ఎక్కువగా జగన్ కోసమే సెర్చ్ చేశారు. సగటున చూసుకుంటే జగన్ కోసం 23% మంది, కిరణ్ కుమార్ రెడ్డి కోసం 0% మంది, చంద్రబాబు నాయుడు కోసం 1% మంది, కేసీఆర్ కోసం 13% మంది సెర్చ్ చేసినట్లు గూగుల్ ట్రెండ్స్ లో స్పష్టమైంది. జాతీయ పత్రికలు కూడా ఈ విషయాన్ని పతాక శీర్షికలతో ప్రధాన కథనాలలో ప్రచురించాయి.
దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి మరణించిన నాటినుంచి జగన్ కు సంబంధించిన కథనాలు, చిత్రాల కోసం నెటిజన్లు ఇంటర్ నెట్ ను విపరీతంగా గాలించారు. ఓదార్పు యాత్ర, కాంగ్రెస్ పార్టీకి రాజీనామా, కొత్తగా పార్టీ ఏర్పాటు... ఇవన్నీ నెటిజన్ల హాట్ ఫేవరెట్లే అయ్యాయి. ఇక తాజాగా 484 రోజుల జైలు జీవితం నుంచి జనజీవితంలోకి జగన్ అడుగుపెట్టగానే ఒక్కసారిగా వెబ్ సైట్ల మీద నెటిజన్లు దాడి చేసినంత పనిచేశారు. ఒకేసారి వేల సంఖ్యలో జగన్ విడుదలకు సంబంధించిన కథనాలు, చిత్రాలు, వీడియోలను వీక్షించారు
0 comments:
Post a Comment