తొలుత సీబీఐ ప్రత్యేక కోర్టులో సీబీఐ తన వాదనలను వినిపించిన సీబీఐ లాయర్ శ్రీ జగన్ కేసులో క్విడ్ ప్రో కో చోటుచేసుకున్నట్లు ఎలాంటి ఆధారమూ లభించలేదని తెలిపారు. ఈ విషయాన్ని పేర్కొంటూ ఒక మెమోను దాఖలు చేశారు. శ్రీ జగన్మోహన్ రెడ్డిపై వచ్చిన ఆరోపణలకు ఎటువంటి ఆధారాలు లేవని పేర్కొంది.
మంత్రి డెవలపర్సు, జూబ్లీ కమ్యూనికేషన్సు, సండూర్ పవర్, కార్మెల్ ఆసియా, ఆర్ఆర్ గ్లోబల్, పివిపి బిజినెస్ వెంచర్సు, క్లాసిక్ రియాలిటీ, సరస్వతి పవర్, ఇండస్ట్రీస్ సంస్థలు శ్రీ జగన్మోహన్ రెడ్డి సంస్థల్లో పెట్టుబడులు పెట్టినట్లు ఎటువంటి ఆధారాలు లేవని ఆ మెమోలో వివరించింది.
కోల్కతా కేంద్రంగా నడుస్తున్న 16 కంపెనీకు సంబంధించిన విచారణ నివేదికను ఆదాయ పన్ను శాఖ, ఎన్ఫోర్సుమెంట్ డైరెక్టరేట్ అధికారులకు సమర్పించామనీ, అవి విచారణను కొనసాగిస్తాయనీ కూడా ఆ మెమోలో పేర్కొన్నారు.
మే 27 2012న సీబీఐ అరెస్టు చేసింది. మూడు రోజుల పాటు హైదరాబాద్ దిల్కుషా అతిథి గృహంలో విచారించిన అనంతరం శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డిని అరెస్టు చేస్తున్నట్లు ప్రకటించిన విషయం అందరికీ తెలిసిందే. మాజీ మంత్రి డాక్టర్ శంకరరావు, టీడీపీ నాయకుడు అశోక్ గజపతి రాజు దాఖలు చేసిన ఫిర్యాదులతో హైకోర్టు ఆదేశం మేరకు సీబీఐ విచారణ చేపట్టింది. ఈ కేసులో సీబీఐ 73మందిని విచారించి, అనేక కంపెనీలను సోదా చేసింది.
0 comments:
Post a Comment