రాష్ట్ర విభజన అంశంపై సమాజ్ వాదీ నేత, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ మద్దతును కోరేందుకు వచ్చానని వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. అర్టికల్ 3 సవరణ గురించి తాము చర్చించామని వైఎస్ జగన్ తెలిపారు. విభజన అంశానికి వ్యతిరేకంగా తాము వెల్లడించిన అభిప్రాయాలకు అఖిలేష్ మద్దతించినందుకు ధన్యవాదాలు అని అన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ తో ప్రారంభమైన అడ్డగోలు విభజన అన్ని ప్రాంతాలకు విస్తరించే ప్రమాదం ఉంది అని జగన్ హెచ్చరించారు.
అసెంబ్లీలో తీర్మానం చేయకుండా రాష్ట్రాన్ని విభజించడం మంచి సాంప్రదాయం కాదు అని జగన్ ఆందోళన వ్యక్తం చేశారు. అసెంబ్లీ తీర్మానం చేయకుండా ఓ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయడం దేశ చరిత్రలో ఇదే ప్రథమం అని అన్నారు. అసెంబ్లీ తీర్మానం లేకుండా రాష్ట్ర విభజన అంశం ఢిల్లీ చేతికి అప్పగిస్తే అనేక అనర్ధాలకు దారితీసే ప్రమాదం ఉంది, ఇతర ప్రాంతాలకు కూడా ఇదే పరిస్థితి ఎదురవుతుంది అని ఆయన అన్నారు.
ప్రజాస్వామ్యాన్ని గౌరవించే ప్రతి ఒక్కరు విభజనను అడ్డుకోవడానికి ముందుకు రావాలని ఆయన కోరారు. ఆంధ్రప్రదేశ్ విభజనను అడ్డుకోవడానికి దేశవ్యాప్తంగా మద్దతు కూడగట్టే అంశంపై బీజేపీ, తృణమూల్ కాంగ్రెస్ పార్టీలతోపాటు అన్ని పార్టీల మద్దతు కోరుతున్నాం అని వైఎస్ జగన్ తెలిపారు.
0 comments:
Post a Comment