రేపు రాష్ట్ర బంద్ కు YSRCP పిలుపు .
బంద్ ను విజయవంతం చేయండి ,సమైక్య వాదులు ,కార్యకర్తలకు YS జగన్ పిలుపు
బంద్ ను విజయవంతం చేయండి ,సమైక్య వాదులు ,కార్యకర్తలకు YS జగన్ పిలుపు
10 జిల్లాలతో కూడిన తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు కేంద్ర కేబినేట్ ఆమోదం తెలుపడాన్ని నిరసిస్తూ రాష్ట్ర బంద్ కు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పిలుపునిచ్చింది. స్వచ్చందంగా బంద్ లో ప్రజలు, వ్యాపార , విద్యా సంస్థలు పాల్గొనాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పిలుపునిచ్చారు.
తెలుగు ప్రజల అభిప్రాయాన్ని కేంద్రం పట్టించుకోలేదు అని వైఎస్ జగన్ ఓ ప్రకటనలో తెలిపారు. రాష్ట్రంలో 75 శాతం మంది ప్రజలు వ్యతిరేకిస్తున్నా కేంద్రం పట్టించుకోలేదని ప్రకటనలో తెలిపారు. బంద్ కు సమాజంలోని ప్రతి పౌరుడు మద్దతివ్వాలని వైఎస్ జగన్ విజ్క్షప్తి చేశారు. కేబినెట్ తీసుకున్న నిర్ణయం వినాశనం దిశగా మరో అడుగు అని వైఎస్ జగన్ అన్నారు.
0 comments:
Post a Comment