అభిమానం పూలవానై కురిసింది - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » అభిమానం పూలవానై కురిసింది

అభిమానం పూలవానై కురిసింది

Written By news on Monday, December 2, 2013 | 12/02/2013

'అభిమానం పూలవానై కురిసింది'
చిత్తూరు : చిత్తూరు జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డికి సమైక్యవాదులు బ్రహ్మరథం పట్టారు. ఆయన రోడ్‌ షోలకు  మంచి ఆదరణ లభించింది. రోడ్లకు ఇరువైపుల నిలబడి సమైక్యవాదులు జై ఆంధ్రప్రదేశ్‌ అంటూ  నినాదాలు చేశారు. సమైక్య సారధి వైఎస్‌  జగన్మోహన్ రెడ్డితో కరచాలనం చేయడానికి అభిమానులు ఉత్సాహం చూపారు.

అభిమానం పూలవానై కురిసింది. మహిళలు హారతులతో తమ అభిమాన నేత వైఎస్‌ జగన్‌మోహన్ రెడ్డికి స్వాగతం పలికారు. చిత్తూరు జిల్లా పలమనేరు నియోజకవర్గంలో పర్యటించిన జగన్‌ మోహన్ రెడ్డికి వి.కోట వాసులు పూలతో స్వాగతం పలికారు. వేలాది జనం సమైక్య శంఖారావానికి మద్దతుగా తరలివచ్చారు.

మేడలు, మిద్దెలు ఎక్కి తమ అభిమాన నేతను చూడటానికి పోటీ పడ్డారు.  తల్లులు చిన్నారులను  తీసుకువచ్చి వైఎస్‌ జగన్‌మోహన్ రెడ్డి చేతిలో పెట్టి..తమ బిడ్డలను ఆశీర్వదించమని కోరారు. వికలాంగుల, వృద్దులకు వైఎస్‌ జగన్‌మోహన్ రెడ్డి ధైర్యం చెప్పారు. అండగా ఉంటారని హామీ ఇచ్చారు. వైఎస్‌ఆర్‌ తనయుడు కదులుతుంటే..ఎటూ విన్నా నినాదాలే వినిపించాయి. విద్యార్థులు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ఆటోగ్రాఫ్‌లు తీసుకోవడం కనిపించింది. చిన్నారులైతే..వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ జెండాలు చేతబట్టి..జగన్నిన్నాదాలు చేశారు.
Share this article :

0 comments: