అభిమానం పూలవానై కురిసింది. మహిళలు హారతులతో తమ అభిమాన నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డికి స్వాగతం పలికారు. చిత్తూరు జిల్లా పలమనేరు నియోజకవర్గంలో పర్యటించిన జగన్ మోహన్ రెడ్డికి వి.కోట వాసులు పూలతో స్వాగతం పలికారు. వేలాది జనం సమైక్య శంఖారావానికి మద్దతుగా తరలివచ్చారు.
మేడలు, మిద్దెలు ఎక్కి తమ అభిమాన నేతను చూడటానికి పోటీ పడ్డారు. తల్లులు చిన్నారులను తీసుకువచ్చి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేతిలో పెట్టి..తమ బిడ్డలను ఆశీర్వదించమని కోరారు. వికలాంగుల, వృద్దులకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ధైర్యం చెప్పారు. అండగా ఉంటారని హామీ ఇచ్చారు. వైఎస్ఆర్ తనయుడు కదులుతుంటే..ఎటూ విన్నా నినాదాలే వినిపించాయి. విద్యార్థులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆటోగ్రాఫ్లు తీసుకోవడం కనిపించింది. చిన్నారులైతే..వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండాలు చేతబట్టి..జగన్నిన్నాదాలు చేశారు.
0 comments:
Post a Comment