ఇదే సమయంలో పాదయాత్ర చేపట్టిన వైఎస్ ప్రజల కష్టసుఖాలను నేరుగా తెలుసుకొని జనం మద్దతుతో ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టారన్నారు. ప్రజల కష్టాలను తీర్చడంతోపాటు అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి మంచి పాలనను అందించారన్నారు. ఆయన ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలతో ప్రజలు హాయిగా జీవించారన్నారు. అటువంటి పాలన మళ్లీ వైఎస్ జగన్మోహన్రెడ్డే అందించగలరన్నారు. ఫ్యాన్ గుర్తుకు ఓటేసి జగన్ను సీఎం చేయాల్సిన ఉందన్నారు. ప్రజల పక్షాన నిత్యం పోరాటాలు చేస్తున్న జగన్ను ముఖ్యమంత్రి చేయలేక పోతే, అంతకంటే దారుణమైన విషయం మరొకటి ఉండదన్నారు.
సైకిల్కు రిపేర్
ఎచ్చెర్ల క్యాంపస్: చిలకపాలెం సభలో పాల్గొన్న విజయనగరం వైఎస్ఆర్సీపీ ఎంపీ అభ్యర్థి బేబే నాయన మాట్లాడుతూ సైకిల్కు రిపేర్ అయ్యిందని, దీంతో చంద్రబాబు దాన్ని బీజేపీ వర్కు షాపునకు అప్పగించారని ఎద్దేవా చేశారు. ఫ్యాన్ గాలిలో బీజేపీ, టీడీపీలు కొట్టుకుపోవడం ఖాయమన్నారు. బాబు ఇస్తున్న హామీలను ప్రజలను నమ్మేస్థితిలో లేరన్నారు.
0 comments:
Post a Comment