శ్రీకాకుళం: ఎన్నికల్లో విజయం సాధించలేమనే నిరాశకు లోనైన టీడీపీ శ్రేణులు పలు జిల్లాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలపై, కార్యకర్తలు దాడులకు దిగుతున్నారు. శ్రీకాకుళం జిల్లా పొందూరు మండలం బెల్లవలసలో వైఎస్ఆర్సీపీ నేతలపై టీడీపీ కార్యకర్తల దాడి చేశారు.
టీడీపీ శ్రేణులు జరిపిన దాడిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత మజ్జి గోపాలకృష్ణ వాహనం ధ్వంసమైంది. టీడీపీ శ్రేణుల దాడిని నిరసిస్తూ పోలీస్ స్టేషన్ వద్ద తమ్మినేని సీతారాం బైఠాయించి ఆందోళన చేపట్టారు. తమ్మినేని ఆందోళనకు పెద్ద ఎత్తున కార్యకర్తలు మద్దతు తెలిపారు.
0 comments:
Post a Comment