25 ఏళ్లుగా కుప్పంను మున్సిపాలిటీ చేయని చంద్రబాబు - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » 25 ఏళ్లుగా కుప్పంను మున్సిపాలిటీ చేయని చంద్రబాబు

25 ఏళ్లుగా కుప్పంను మున్సిపాలిటీ చేయని చంద్రబాబు

Written By news on Thursday, May 1, 2014 | 5/01/2014

'చంద్రబాబు వల్లే రాష్ట్రం రెండు ముక్కలు'
శ్రీకాకుళం: విలువలు, విశ్వసనీయత గల వ్యక్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని రాజాం సభలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ అన్నారు. ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండేది జగన్ మాత్రమేనని విజయమ్మ తెలిపారు.  చంద్రబాబు వస్తే..సీఎంగా, ప్రతిపక్షనేతగా మాకు ఏంచేశావని నిలదీయండని ప్రజలకు వైఎస్ విజయమ్మ సూచించారు. 
 
తన హయాంలో అన్ని ఛార్జీలు పెంచింది చంద్రబాబేనని,  చంద్రబాబు తన అనుచరులకు బినామీ పేర్లతో ప్రభుత్వ ఆస్తులను కట్టబెట్టారని వైఎస్ విజయమ్మ విమర్శించారు. వైఎస్ జగన్ అధికారంలోకి రాగానే వైఎస్ఆర్ సంక్షేమ పథకాలు అమలు చేస్తారన్నారు. 
 
25 ఏళ్లుగా కుప్పంను మున్సిపాలిటీ చేయని చంద్రబాబు రాష్ట్రాన్ని ఏ విధంగా సింగపూర్ చేస్తానని అంటున్నారని విజయమ్మ ప్రశ్నించారు.  చంద్రబాబు హయాంలో తన ఆస్తులనే పెంచుకున్నాడు తప్ప ప్రజలకు ఏ అభివృద్ధి చేయలేదని వైఎస్ విజయమ్మ ఆరోపించారు. 
 
3 వేల సంవత్సరాలుగా  మనమంతా కలిసి ఉన్నామని,  చంద్రబాబు వల్లే రాష్ట్రం రెండు ముక్కలయిందని విజయమ్మ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజలకు ఎవరు మేలు చేస్తారో ఆలోచించండి, వైఎస్ఆర్‌సీపీకి అండగా నిలవండి. వైఎస్ జగన్‌ను ఆశీర్వదించండి అని వైఎస్ విజయమ్మ కోరారు
Share this article :

0 comments: