రాష్ట్ర ప్రభుత్వానికి లిక్కర్ కంపెనీలపై ఉన్న ప్రేమ రైతులపై లేదని ఎమ్మెల్యే శోభానాగిరెడ్డి విమర్శించారు. ఆళ్లగడ్డలో గురువారం ఆమె విలేకరులతో మాట్లాడారు. వరికి బోనస్ ఇవ్వలేని ప్రభుత్వం.. లిక్కర్ కంపెనీలకు రాయితీ కల్పించడం దారుణమన్నారు. జలయజ్ఞం దండగ అన్న బాబు బాటలోనే సీఎం కిరణ్ పయనిస్తున్నారన్నారు. వైఎస్ ఆశయ సాధనే తమ ధ్యేయమని చెబుతున్న కిరణ్ జలయజ్ఞంపైనే విమర్శలు చేయడం హాస్యాస్పదమన్నారు. కొత్త ఉద్యోగాలు కల్పిస్తున్నామంటున్న సీఎం కాంట్రాక్టు ఉద్యోగుల సంఖ్య వెల్లడించాలని డిమాండ్ చేశారు. ఉప ఎన్నికలు వస్తే మంత్రులు, కాంగ్రెస్ నాయకులు గ్రామాల్లో తిరగలేని పరిస్థితులు నెలకొంటాయన్నారు.
Home »
» లిక్కర్ కంపెనీలపై ఉన్న ప్రేమ రైతులపై లేదు
లిక్కర్ కంపెనీలపై ఉన్న ప్రేమ రైతులపై లేదు
Written By ysrcongress on Friday, December 16, 2011 | 12/16/2011
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment