రాష్ట్రంలో మళ్లీ వైఎస్ నాటి స్వర్ణయుగం వైఎస్ జగన్మోహన్రెడ్డివల్లే సాధ్యమవుతుందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత చెవిరెడ్డి భాస్కర్రెడ్డి అన్నారు. అందుకోసం వైఎస్సార్ కాంగ్రెస్పార్టీ బలోపేతానికి ఎన్నారైలు తోడ్పాటు అందించాలని విజ్ఞప్తి చేశారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం దుబాయ్లో శనివారం ఘనంగా జరిగింది. వైఎస్సార్ అభిమాని సి.వి.ఆర్.రాజు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో 400 మంది పాల్గొన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్కు సంపూర్ణ మద్దతు ప్రకటించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత చెవిరెడ్డి భాస్కర్రెడ్డి హాజరయ్యారు. సభ్యత్వ నమోదుకు కొనసాగింపుగా దుబాయ్లో వచ్చే జనవరి 6న భారీఎత్తున కార్యక్రమాన్ని నిర్వహించాలని నిర్ణయించారు. కార్యక్రమంలో చెవిరెడ్డి మాట్లాడుతూ.. మహానేత చనిపోయాక రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులను వివరించారు. వైఎస్సార్ తర్వాత పగ్గాలు చేపట్టినవారు సమర్థంగా పాలించకపోవటంతో రాష్ట్రం వెనుకబడిపోయిందన్నారు. పేదలకోసం వైఎస్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను ప్రస్తుత ప్రభుత్వం నిర్వీర్యం చేస్తోందన్నారు.కార్యక్రమంలో ఎన్నారైలు సుదర్శన్, తులసి, నజీర్, అజయ్, సునీల్కుమార్రెడ్డి, ఆర్.వి.భాస్కర్రెడ్డి, వైసీ శేఖర్రాజు, ఐజాక్ నేలపాటి, భూషణమ్ శామ్యూల్, రవి పండు, గంటా విజయకుమార్ పాల్గొన్నారు.
Home »
» వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం దుబాయ్లో
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం దుబాయ్లో
Written By ysrcongress on Sunday, December 11, 2011 | 12/11/2011
రాష్ట్రంలో మళ్లీ వైఎస్ నాటి స్వర్ణయుగం వైఎస్ జగన్మోహన్రెడ్డివల్లే సాధ్యమవుతుందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత చెవిరెడ్డి భాస్కర్రెడ్డి అన్నారు. అందుకోసం వైఎస్సార్ కాంగ్రెస్పార్టీ బలోపేతానికి ఎన్నారైలు తోడ్పాటు అందించాలని విజ్ఞప్తి చేశారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం దుబాయ్లో శనివారం ఘనంగా జరిగింది. వైఎస్సార్ అభిమాని సి.వి.ఆర్.రాజు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో 400 మంది పాల్గొన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్కు సంపూర్ణ మద్దతు ప్రకటించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత చెవిరెడ్డి భాస్కర్రెడ్డి హాజరయ్యారు. సభ్యత్వ నమోదుకు కొనసాగింపుగా దుబాయ్లో వచ్చే జనవరి 6న భారీఎత్తున కార్యక్రమాన్ని నిర్వహించాలని నిర్ణయించారు. కార్యక్రమంలో చెవిరెడ్డి మాట్లాడుతూ.. మహానేత చనిపోయాక రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులను వివరించారు. వైఎస్సార్ తర్వాత పగ్గాలు చేపట్టినవారు సమర్థంగా పాలించకపోవటంతో రాష్ట్రం వెనుకబడిపోయిందన్నారు. పేదలకోసం వైఎస్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను ప్రస్తుత ప్రభుత్వం నిర్వీర్యం చేస్తోందన్నారు.కార్యక్రమంలో ఎన్నారైలు సుదర్శన్, తులసి, నజీర్, అజయ్, సునీల్కుమార్రెడ్డి, ఆర్.వి.భాస్కర్రెడ్డి, వైసీ శేఖర్రాజు, ఐజాక్ నేలపాటి, భూషణమ్ శామ్యూల్, రవి పండు, గంటా విజయకుమార్ పాల్గొన్నారు.
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment