జగన్కు బెయిల్ రాకుండా చేయడానికే ఢిల్లీకి వెళ్లి రాష్ట్రపతి సహ అన్ని పార్టీల నేతలను ఆయన కలిశారని అన్నారు. పైకి మాత్రం రాష్ట్రంలో పరిస్థితులను వివరించేందుకు అని ప్రచారం చేసుకుంటున్నారని విమర్శించారు. జగన్ బెయిల్ పై బయటకు వస్తే తనకు రాజకీయ భవిష్యత్ ఉండదని బాబు భయపడుతున్నారని అన్నారు. ఇరుప్రాంతాల నాయకులతో వెళ్లడం వెనుక రాజీ ప్రయత్నం ఏంటి, తెలంగాణ నేతలతో సీమాంధ్ర నాయకులు తెలంగాణకు కట్టుబడి ఉన్నారా అంటూ ప్రశ్నించారు.
పిల్ల పార్టీ సృష్టికర్త చంద్రబాబే అన్నారు. ఎన్టీఆర్ ఆశయాలు తుంగలో తొక్కి కాంగ్రెస్ కు టీడీపీని పిల్ల పార్టీ చేశారని దుయ్యబట్టారు. రాజ్ నాథ్సింగ్ను చంద్రబాబు కలవడం వెనుక కారణాలు ఏంటని దాడి వీరభధ్రరావు ప్రశ్నించారు. రాష్ట్రపతితో ఏం చెప్పారో రాష్ట్ర ప్రజలకు వెల్లడించాలని డిమాండ్ చేశారు.
0 comments:
Post a Comment