సమైక్య శంఖారావానికి ప్రయివేటు విద్యాసంస్థల మద్దతు - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » సమైక్య శంఖారావానికి ప్రయివేటు విద్యాసంస్థల మద్దతు

సమైక్య శంఖారావానికి ప్రయివేటు విద్యాసంస్థల మద్దతు

Written By news on Sunday, October 20, 2013 | 10/20/2013

ఆంధ్రప్రదేశ్‌ను ఎట్టి పరిస్థితుల్లోనూ విభజించరాదని, రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 26వ తేదీన హైదరాబాద్‌లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నిర్వహించ తలపెట్టిన సమైక్య శంఖారావం సభకు రాష్ట్రంలోని ప్రయివేటు విద్యాసంస్థల కరెస్పాండెంట్లు తమ సంపూర్ణ మద్దతును ప్రకటించారు.  వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆదివారం సమావేశమైన కరెస్పాండెంట్లు సభను విజయవంతం చేయడానికి తమ వంతు సహాయ సహకారాలు అంద జేయడానికి ముందుకు వచ్చారు.
 
పేద విద్యార్థులందరూ ఉన్నత విద్యను అభ్యసించాలనే ఆశయంతో దివంగత వై.ఎస్.రాజశేఖరరెడ్డి ప్రవేశ పెట్టిన ఫీజు ఈయింబర్స్‌మెంట్ పథకం వల్ల ఎంతో మంది ప్రయోజనం పొందారని సమావేశంలో అభిప్రాయపడ్డారు. రాష్ట్ర విభజన జరిగితే పేద విద్యార్థులకు ఉన్నత విద్య అందించ లేక నిధుల కొరత ఏర్పడుతుందని పేర్కొన్నారు. ఉపాధి అవకాశాలు కూడా దెబ్బ తింటాయనే ఆవేదన కూడా సమావేశంలో వ్యక్తం అయింది. ఈ సమావేశానికి పార్టీ శాసనసభాపక్షం ఉప నాయకురాలు భూమా శోభానాగిరెడ్డి హాజరయ్యారు. ప్రయివేటు విద్యాసంస్థల నుంచి పి.మదన్‌మోహన్‌రెడ్డి, బి.ప్రసాదరాజు, హరిప్రసాద్, వెంకటేష్‌నాయుడు, గంగిరెడ్డి, జయచంద్రారెడ్డితో సహా పలువురు హాజరయ్యారు.



సమైక్యశంఖారావం పోస్టర్ ఆవిష్కరణ


హైదరాబాద్: రాష్ట్రాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ విభజించరాదని డిమాండ్ చేస్తూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఈనెల 26న నిర్వహించ తలపెట్టిన ‘సమైక్యశంఖారావం’ పోస్టర్‌ను ఆదివారమిక్కడ పార్టీనేతలు ఆవిష్కరించారు. ‘జనం మాటే జగన్ బాట’ నినాదంతో రూపొందించిన పోస్టర్‌ను, రాష్ట్ర సమైక్యంగా ఉండాల్సిన ఆవశ్యకతను వివరించిన కరపత్రాన్ని నేతలు విడుదల చేశారు. ఈ పోస్టర్‌లో తెలుగుతల్లి చిత్రంతో పాటు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి, పార్టీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ, అధ్యక్షుడు జగన్‌మోహన్‌రెడ్డి చిత్రాలను పొందుపరిచారు. పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమంలో పార్టీ నేతలు ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, గట్టు రామచంద్రరావు, కె.శివకుమార్, కోటింరెడ్డి వినయ్‌రెడ్డి, ఆదం విజయ్‌కుమార్, లింగాల హరిగౌడ్, మహ్మద్ పాల్గొన్నారు.
 
ఈ సందర్భంగా ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ... సమైక్యశంఖారావం ఒక చారిత్రక అవసరమన్నారు. సమైక్యవాదులంతా పెద్ద ఎత్తున హాజరై సభను విజయవంతం చేయాలని కోరారు. ఈ సభను చూసిన తర్వాతైన ప్రజల ఆకాంక్ష మేరకు కేంద్ర పాలకులు విభజన నిర్ణయం మార్చుకుంటారనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు
Share this article :

0 comments: