ముంపు ప్రాంతాల్లో రేపటి నుంచి విజయమ్మ పర్యటన - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » ముంపు ప్రాంతాల్లో రేపటి నుంచి విజయమ్మ పర్యటన

ముంపు ప్రాంతాల్లో రేపటి నుంచి విజయమ్మ పర్యటన

Written By news on Saturday, October 26, 2013 | 10/26/2013

ముంపు ప్రాంతాల్లో రేపటి నుంచి విజయమ్మ పర్యటన
హైదరాబాద్ : వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ ఆదివారం నుంచి కృష్ణా, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల్లో పర్యటించనున్నారు. వరద ముంపు ప్రాంతాల్లో పర్యటించి బాధితుల సమస్యలను స్వయంగా తెలుసుకోనున్నారు. పంటలు కోల్పోయిన రైతులను, నిరాశ్రయులైన ప్రజలను విజయమ్మ పరామర్శించనున్నారు.

వరద ముంపునకు గురైన శ్రీకాకుళం జిల్లాలో ఇటీవల వైఎస్ విజయమ్మ పర్యటించిన సంగతి తెలిసిందే. భాదితులు, రైతుల కష్టాలను తెలుసుకుని, వారి ఆదుకోవాల్సిందిగా ప్రధాని మన్మోహన్ సింగ్ కు లేఖ రాశారు. ఐదు రోజులుగా రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలకు అపార నష్టం వాటిల్లుతోంది. 29 మంది మరణించగా, లక్షలాది ఎకరాల్లో పంట నష్టం వాటిల్లింది. వర్షాలు, వరదల ప్రభావంతో కొన్ని జిల్లాల్లో రాకపోకలు స్తంభించిపోయాయి.
Share this article :

0 comments: