ఖమ్మం: ఎవరైతే పేదవాడి మనసెరుగుతాడో అలాంటి నాయకుణ్ని మనం ముఖ్యమంత్రిగా తెచ్చుకోవాలని ప్రజలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి విజ్క్షప్తి చేశారు.
ఖమ్మం జిల్లా వైరా సభలో వైఎస్ జగన్ మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి అంటే ఇలా ఉండాలని రాష్ట్రానికే కాదు దేశానికే చాటిచెప్పిన వ్యక్తి వైఎస్ఆర్ అని అన్నారు. మహానేత వైఎస్ఆర్ కంటే ముందు చాలా మంది సీఎంలు వచ్చారని, కుల,మతాలు కతీతంగా పాలన సాగించింది వైఎస్ఆర్ ఒక్కరే అని వైఎస్ జగన్ అన్నారు.
విశ్వసనీయత అంటే తెలియని వాడికి రాజకీయం శుద్ధ దండగ అవుతుందని, విశ్వసనీయత, నిజాయతీ - కుళ్లు, కుతంత్రాల మధ్య ఇప్పుడు ఎన్నికలు జరగబోతున్నాయని వైఎస్ జగన్ అన్నారు. ఇలాంటి పోటీల్లో విశ్వసనీయతకు ఓటేయ్యండని వైఎస్ జగన్ పిలుపునిచ్చారు. ఓటేసేముందు మనమందరం ఆలోచించి ఓటు వేయాలన్నారు.
0 comments:
Post a Comment