హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో గురువారం జరిగిన పరిణామాలపై ప్రతిపక్ష నేత, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి శుక్రవారం ట్విట్ చేశారు. అసెంబ్లీలో పాలకపక్ష పరాకాష్టను ట్విట్టర్ లో ఆయన నిలదీశారు. 'అసెంబ్లీలో కట్ చేసింది నా మైక్ కాదు... వారు ఆపేసింది ఆంధ్రప్రదేశ్ ప్రజల గొంతుక. బడ్జెట్ పై అసెంబ్లీలో వినిపించాల్సిన నా స్పందనను ఉదయం 11 గంటలకు మీడియా ముందు వినిపిస్తాం.' అని వైఎస్ జగన్ ట్విట్ చేశారు.
కాగా ఏపీ శాసనసభలో ప్రతిపక్షంపై అధికార పక్షం, స్పీకర్ కోడెల శివప్రసాద్ వ్యవహరించిన తీరు పట్ల వైఎస్ జగన్ నిన్న తీవ్ర అసహనం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. నిష్పక్షపాతంగా వ్యవహరించాల్సిన స్పీకర్....ప్రభుత్వ ప్రతినిధిలా సభను నడిపిస్తున్నారని ఆరోపించారు. ప్రజాస్వామ్య హక్కులను కాలరేసేలా ప్రవర్తిస్తున్నారని వ్యాఖ్యానించారు.
0 comments:
Post a Comment