గవర్నర్ కు వైఎస్ఆర్ సీపీ ఫిర్యాదు - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » గవర్నర్ కు వైఎస్ఆర్ సీపీ ఫిర్యాదు

గవర్నర్ కు వైఎస్ఆర్ సీపీ ఫిర్యాదు

Written By news on Thursday, March 19, 2015 | 3/19/2015

హైదరాబాద్ : వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నేతృత్వంలో పార్టీ ఎమ్మెల్యేలు గురువారం గవర్నర్ నరసింహన్ ను కలిశారు.  రాజ్ భవన్ లో గవర్నర్ కలిసిన వీరు... ప్రభుత్వంతో పాటు, స్పీకర్ పై ఫిర్యాదు చేశారు. స్పీకర్ వ్యవహార శైలితో పాటు, ప్రతిపక్షంపై ప్రభుత్వం ఎదురుదాడికి దిగటం, వ్యక్తిగత దూషణలు,  పార్టీ ఎమ్మెల్యేలను సస్పెండ్ చేయటంపై వైఎస్ఆర్ సీపీ ...ఈ సందర్భంగా గవర్నర్ దృష్టికి తీసుకు వచ్చింది.

కాగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఈరోజు మధ్యాహ్నం రెండు గంటలకు లోటస్ పాండ్ లో మీడియా సమావేశంలో మాట్లాడనున్నారు.
Share this article :

0 comments: