జగన్‌కు కడదాకా తోడు - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » జగన్‌కు కడదాకా తోడు

జగన్‌కు కడదాకా తోడు

Written By news on Thursday, May 31, 2012 | 5/31/2012

వైఎస్ సమాధి వద్ద ప్రతిజ్ఞ 
వైఎస్సార్ సీపీలో వివేకా చేరిక

పులివెందుల(వైఎస్‌ఆర్‌జిల్లా), న్యూస్‌లైన్: మహానేత పై విమర్శలు గుప్పించడమే కాక, వైఎస్ జగన్‌మోహన్ రెడ్డిని ఇబ్బందులకు గురిచేస్తున్న పాలక ప్రతిపక్షాల కుట్రలను తిప్పికొట్టేందుకు వైఎస్ జగన్‌కు కడదాకా తోడుంటామని మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి కార్యకర్తలు, నాయకులతో ప్రతిజ్ఞ చేయిం చారు. కాంగ్రెస్ పార్టీకి గుడ్‌బై చెప్పిన వివేకా తన అనుచరగణంతో ఉదయం ఇడుపులపాయకు తరలివచ్చారు. వైఎస్‌ఆర్ విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు. కొద్దిసేపు మౌనం పాటించి కార్యకర్తలతో కలసి వైఎస్ సమాధి వద్దకు చేరుకున్నారు. అక్కడ ప్రణమిల్లిన వివేకా కొద్దిసేపు ప్రార్థన చేశారు. వైఎస్ జగన్‌కు మద్దతుగా నిలిచి కష్టకాలంలో పాలుపంచుకుంటూ ముందుకు నడుస్తామని సమాధి సాక్షిగా ప్రతిజ్ఞ చేశారు. 


జగన్‌పై కక్షసాధింపు...: రాష్ట్రంలో అత్యంత ప్రజాదరణ కలిగిన నేత జగన్‌మోహన్‌రెడ్డి ఒక్కడేనని.. రాజకీయంగా ఎదుర్కోలేక పాలక, ప్రతిపక్షాలు కుట్రపన్ని రాజకీయ కారణాల తోనే యువనేత వైఎస్ జగన్‌రెడ్డిపై కక్ష సాధింపునకు పూనుకున్నాయని వివేకానందరెడ్డి దుయ్యబట్టారు. వైఎస్‌సమాధి వద్ద కార్యకర్తలనుద్దేశించి ఆయన ఉద్వేగంగా ప్రసంగించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీని రాజన్న తన రెక్కల కష్టంతో అధికారంలోకి తెస్తే ఈ రోజు ఆ కుటుంబాన్ని ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. రాష్ట్ర ప్రయోజనాల కోసమే కేబినెట్ మంత్రుల ఆమోదంతోనే భూ కేటాయింపులు జరిగినట్లు వెల్లడించారు. చంద్రబాబు అవినీతిపై కూడా సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. 

మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డిపై సీబీఐ అభియోగాలు మోపుతూ, జగన్‌పై నిందలు వేస్తున్నా ప్రభుత్వం అఫిడవిట్ దాఖలు చేయకపోవటం దారుణమని దుయ్యబట్టారు. ప్రస్తుతం జరుగుతున్న ఉప ఎన్నికల్లో కాంగ్రెస్, టీడీపీ అభ్యర్థులను చిత్తుగా ఓడించాలని వివేకా ప్రజలకు పిలుపునిచ్చారు. అనంతరం రాయచోటి వైఎస్‌ఆర్‌సీపీ కార్యాలయానికి చేరుకున్న వివేకా నియోజకవర్గ సమన్వయకర్త ఎస్.రఘురామిరెడ్డి పార్టీ కండువా వేసి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు.
Share this article :

0 comments: