Home »
» చంద్రబాబు ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం
చంద్రబాబు ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం పెట్టాలని ప్రతిపక్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. మార్చి 5 వ తేదీ నుంచి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. అసెంబ్లీ సమావేశాల్లో తొలిరోజే చంద్రబాబు ప్రభుత్వంపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అవిశ్వాస తీర్మానం పెట్టనుంది. ఏపీ ప్రభుత్వం ఇచ్చిన హామీలను విస్మరించటంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ సమావేశాల్లో అసెంబ్లీ సాక్షిగా ప్రభుత్వాన్ని ఎండగట్టాలని నిర్ణయించింది.
0 comments:
Post a Comment