పగలు మాట్లాడింది రాత్రి గుర్తుండదు - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » పగలు మాట్లాడింది రాత్రి గుర్తుండదు

పగలు మాట్లాడింది రాత్రి గుర్తుండదు

Written By news on Friday, March 4, 2016 | 3/04/2016


పగలు మాట్లాడింది రాత్రి గుర్తుండదు
♦ సీఎం కేసీఆర్‌పై ఎంపీ పొంగులేటి విమర్శ
♦ 29,48,36,34,26 డివిజన్లలో రోడ్‌షోలు
 ఖమ్మం : సీఎం కేసీఆర్‌కు పగలు మాట్లాడింది రాత్రి గుర్తుండదు.. రాత్రి మాట్లాడింది మరునాడు గుర్తుండదు.. ఇక ప్రజలకు ఇచ్చిన హామీలు ఎలా గుర్తుంటాయని వైఎస్సార్ సీపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి విమర్శించారు. 29వ డివిజన్ ఖిల్లా మసీద్ సెంటర్‌లో గురువారం ఎంపీ పొంగులేటి, మాజీ ఎమ్మెల్సీ రెహమాన్, పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వహించిన బహిరంగ సభలో పొంగులేటి మాట్లాడుతూ ఎన్నికల ఫలితాల్లో 29వ డివిజన్ నుంచి వైఎస్సార్ సీపీ అభ్యర్థి రఫీబాయ్(షేక్ రఫీయుద్దీన్)ను అధికారులు విజేతగా ప్రకటిస్తారని స్పష్టం చేశారు. ఖిల్లాలో వైఎస్సార్ సీపీ జెండా ఎగురవేసేందుకు ఇక్కడి ముస్లింలు పడుతున్న కష్టం అభినందనీయమన్నారు. ఏ ముఖ్యమంత్రి కట్టి వ్వనన్ని ఇళ్లను వైఎస్.రాజశేఖరరెడ్డి మాత్రమే కట్టించారని గుర్తు చేశారు. మాయమాటలు చెప్పి ప్రజలను మభ్య పెట్టాలని చూసే టీఆర్‌ఎస్‌ను చిత్తుచిత్తుగా ఓడించాలన్నారు.
 డిప్యూటీ సీఎం ఖిల్లాకు వచ్చారా..? : మాజీ ఎమ్మెల్సీ రెహమాన్
మహమూద్ అలీ డిప్యూటీ సీఎం అయిన తర్వాత ఒక్కసారైనా ఖమ్మం ఖిల్లాకు వచ్చారా అని మాజీ ఎమ్మెల్సీ, వైఎస్సార్ సీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రెహమాన్ ప్రశ్నించారు. పదవి కోసం.. పెత్తనం కోసం.. కుర్చీల కోసం తానెప్పుడూ రాజకీయాలు చేయలేదన్నారు. ఇప్పటికే చాలాసార్లు తాను ఖిల్లాకు వచ్చానని.. సాటి ముస్లింల కష్టాలు తెలుసుకుంటూనే ఉన్నానన్నారు. ఖిల్లాలో ముస్లింలు చేసే జై జగన్ నినాదాలు గోల్కొండ ఖిల్లాకు వినిపించాలన్నారు. ముస్లింల బాగోగులు చూసుకున్న ఏకైక నాయకుడు వైఎస్.రాజశేఖరరెడ్డి మాత్రమేనని అన్నారు. తెలంగాణ రాష్ట్రం కేసీఆర్ జాగీర్ కాదు.. ఖమ్మంలో సరైన రోడ్లు, డ్రెయిన్లు, మౌళిక సదుపాయాలే లేవు.. కేవలం కేసీఆర్ మాటలతోనే ప్రజలను పరేషాన్ చేస్తున్నారన్నారు. మీకు ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు అన్ని విధాల అండగా ఉంటారన్నారు. ప్రతి ఒక్కరూ ఫ్యాన్ గుర్తుకు ఓట్లేసి రఫీయుద్దీన్‌ను గెలిపించి.. అల్లాహ్ ఆశీస్సులు అందించాలని వేడుకుంటున్నానన్నారు.
 ఫ్యాన్ గుర్తుకు ఓట్లేయండి..
ఖిల్లావాసులు, కార్పొరేషన్ పరిధిలోని ఓటర్లు ఫ్యాన్ గుర్తుకు ఓట్లేసి గెలిపించాలని పినపాక ఎమ్మెల్యే, వైఎస్సార్ సీపీ ఫ్లోర్ లీడర్, పార్టీ జిల్లా అధ్యక్షుడు పాయం వెంకటేశ్వర్లు అభ్యర్థించారు. ముస్లింల అభ్యున్నతికి పాటుపడింది కేవలం వైఎస్సార్ మాత్రమేనని అన్నారు. పేద ముస్లిం పిల్లలు చదువుకుని ఉన్నత స్థితిలో ఉండి.. తల్లిదండ్రులను మంచిగా చూసుకుంటున్నారంటే అది వైఎస్సార్ చలవేనని అన్నారు. ప్రచారంలో నాయకులు శివకుమార్, ఫెరోజ్, వసీం, ఇమ్రాన్, షకీల్, సలీం, రవి, జాకీర్, షాబిర్, షౌకత్ అజుం, నిరంజన్ సాధు తదితరులు పాల్గొన్నారు.
 48వ డివిజన్‌లో.. 
48వ డివిజన్‌లో వైఎస్సార్ సీపీ అభ్యర్థి చిత్తలూరి నర్సయ్యగౌడ్ ఫ్యాన్ గుర్తుపై ఓట్లేసి గెలిపించాలని ఎంపీ, వైఎస్సార్ సీపీ రాష్ట్ర అధ్యక్షుడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి కోరారు. 48వ డివిజన్ దానవాయిగూడెం పార్కు, సారధి నగర్, బ్రిడ్జి ఏరియాల్లో ఎంపీ ప్రచారం నిర్వహించారు. ఇంటింటికీ తిరుగుతూ చిత్తలూరి నర్సయ్యగౌడ్ ఫ్యాన్ గుర్తుపై ఓట్లేసి గెలిపించాలని కోరారు. ప్రచార కార్యక్రమంలో పాలేరు నియోజకవర్గ ఇన్‌చార్జ్ సాధు రమేష్‌రెడ్డి, డాక్టర్ చిత్తలూరి రవి, డాక్టర్ చిత్తలూరి లక్ష్మణ్‌కుమార్, సింగరపు యాగలక్ష్మి, సురభి లింగయ్య, కొంపెల్లి రాములు, చంద్రమ్మ, అనిల్ తదితరులు పాల్గొన్నారు.
 36వ డివిజన్‌లో...
ఫ్యాన్ గుర్తుకు ఓటేసి.. 36వ డివిజన్ వైఎస్సార్ సీపీ అభ్యర్థి మేడవరపు ఆదినారాయణను గెలిపించాలని ఎంపీ, వైఎస్సార్ సీపీ రాష్ట్ర అధ్యక్షుడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి విజ్ఞప్తి చేశారు. 36వ డివిజన్ పరిధిలోని బస్ డిపో రోడ్, మయూరి సెంటర్, ట్రాన్స్‌కో ఎస్‌ఈ రోడ్ ప్రాంతాల్లో ఎంపీ పొంగులేటి గురువారం రోడ్‌షో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్లమెంట్ ఎన్నికల్లో తనను ఆశీర్వదించిన విధంగానే.. ఫ్యాన్ గుర్తుకు ఓట్లేసి ఆదినారాయణను గెలిపించాలని కోరారు. ప్రచారంలో వైఎస్సార్ సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఆకుల మూర్తి, జిల్లా అధికార ప్రతినిధి ఎం.నిరంజన్‌రెడ్డి, వైరా నియోజకవర్గ ఇన్‌చార్జ్ బొర్రా రాజశేఖర్, నారుమళ్ల వెంకన్న తదితరులు పాల్గొన్నారు.
 34వ డివిజన్‌లో...
34వ డివిజన్ అభ్యర్థి డాక్టర్ దోరేపల్లి శ్వేతను గెలిపించేందుకు ఫ్యాన్ గుర్తుపై ఓట్లేయాలని ఎంపీ, వైఎస్సార్ సీపీ రాష్ట్ర అధ్యక్షుడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి విజ్ఞప్తి చేశారు. 34వ డివిజన్‌లోని రాపర్తి నగర్, బీసీ కాలనీ, ఎస్సీ కాలనీ, జర్నలిస్టు కాలనీల్లో రోడ్‌షో, పాదయాత్ర నిర్వహించారు. అనంతరం బీసీ కాలనీలో ప్రజలతో మాట్లాడారు. సమస్యలు పరిష్కారం కావాలంటే శ్వేతను అఖండ మెజార్టీతో గెలిపించాలని కోరారు. ప్రచారంలో ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు, పార్టీ జాతీయ ఉపాధ్యక్షుడు కే.శివకుమార్, రాష్ట్ర అధికార ప్రతినిధి ఆకుల మూర్తి, జిల్లా అధికార ప్రతినిధి ముదిరెడ్డి నిరంజన్‌రెడ్డి, వైరా నియోజకవర్గ ఇన్‌చార్జ్ బొర్రా రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు.
 26వ డివిజన్‌లో...
26వ డివిజన్ వైఎస్సార్ సీపీ అభ్యర్థి ఎండీ.ముస్తఫాను భారీ మెజార్టీతో గెలిపించాలని ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి కోరారు. ఫ్యాన్ గుర్తుకు ఓటేయాలని డివిజన్‌లో గురువారం ఆయన విస్తృతంగా ప్రచారం చేశారు. ఈ సందర్భంగా జరిగిన బహిరంగ సభలో పొంగులేటి మాట్లాడారు. డివిజన్‌లో ఆక్రమణకు గురైన వికలాంగుల భూములను తిరిగి ఇప్పించేం దుకు పోరాటాలు చేస్తానన్నారు. ఎన్నికల సందర్భంగా రానున్న 30 గంటల్లో ఏమైనా జరగొచ్చని అన్నారు. వైఎస్సార్ సీపీ జాతీయ కార్యదర్శి, మాజీ ఎమ్మెల్సీ రెహమాన్ మాట్లాడుతూ ఒక్కసారి ముస్తఫాను ఓటుతో ఆశీర్వదిస్తే.. జీవితాంతం అన్ని వర్గాలకు సేవ చేసుకుంటాడన్నారు. ముస్లింలకు 4 శాతం రిజర్వేషన్లు కల్పించిన ఏకైక సీఎం వైఎస్సార్ అని గుర్తు చేశారు. పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ముస్తఫాను గెలిపించుకుని మీ సమస్యలు పరిష్కరించుకోవాలన్నారు. అభ్యర్థి ముస్తఫా మాట్లాడుతూ తనను గెలిపిస్తే ఎంపీ సహకారంతో సమస్యలు పరిష్కరిస్తానన్నారు. పార్టీ ప్రతినిధి ఆకుల మూర్తి, జిల్లా అధికార ప్రతినిధి ముదిరెడ్డి నిరంజన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Share this article :

0 comments: