జగన్ మగాడైతే,రాయలసీమ రక్తం కలిగినవాడైతే తనతో చర్చకు రావాలని టిడిపి నేత కేశవ్ అనడంపై వైఎస్ ఆర్ కాంగ్రెస్ అదికార ప్రతినిది అంబటి రాంబాబు మండిపడ్డారు.కేశవ్ బతుక్కి తమ నేత జగన్ చర్చకు రానవసరం లేదని, తాము ఎవరిమైనా సరిపోతామని, ఉరవకొండలో చర్చకు సిద్దమని ఆయన అన్నారు.కేశవ్ కు సిగ్గు శరం, చీము,నెత్తురు ఉంటే ఉరవకొండలో చర్చకు సిద్దం కావాలని అంబటి అన్నారు.వాళ్లకు దమ్ముంటే సిబిఐ విచారణకు, లేదా సిటింగ్ జడ్జితో విచారణకు సిద్దపడాలని ఆయన అన్నారు. తాను బినామీ పేర్లతో కొనలేదని, మగాడిలా తన కొడుకు పేరుమీదే భూమి కొన్నానని పయ్యావుల అంటున్నారని, ఆయన మగాడిలా కొంటే.. మరి బినామీ పేర్లతో కొన్న చంద్రబాబు, లోకేష్, నారాయణల పరిస్థితేంటి, వాళ్లు మగాళ్లు కారా అని అంబటి వ్యాఖ్యానించారు.వీరంతా ముందుగానే అక్కడ ఎలా కొన్నారన్నది ప్రశ్న అని ఆయన అన్నారు. తనపై కధనాలు వేయవద్దని రాత్రి పొద్దుపోయేదాకా ఎందుకు కేశవ్ సాక్షిని బతిమలాడుకున్నారో చెప్పాలని ఆయన అన్నారు.రాయలసీమలో పుట్టినవాడివి.. రాజధాని ప్రాంతం గురించి ముందే తెలుసుకుని, అక్కడ భూములు కొనే నక్కజిత్తులు ఎలా వచ్చాయని ప్రశ్నించారు. మగాడినని ప్రగల్భాలు పలకడం కాదు, చేతల్లో చూపించుకోవాలని హితవు పలికారు. మొత్తం అన్ని విషయాలు బయటకు వచ్చాక, మీ పెదబాబు, చినబాబు, పరివారం మొత్తాన్ని తీసుకురావాలని అన్నారు. మీ నాయకులు బినామీ పేర్లతో కొన్న స్థలంలోకి వస్తారో.. మీ అబ్బాయి పేరు మీద కొన్న నాలుగెకరాల్లోకి వస్తారో రావాలని సవాలు చేశారు.
Home »
» కేశవ్ కు సిగ్గు శరం, చీము,నెత్తురు ఉంటే ఉరవకొండలో చర్చకు సిద్దం కావాలని ...
కేశవ్ కు సిగ్గు శరం, చీము,నెత్తురు ఉంటే ఉరవకొండలో చర్చకు సిద్దం కావాలని ...
Written By news on Thursday, March 3, 2016 | 3/03/2016
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment