తన తనయుడు జగన్ అరెస్ట్ ను నిరసిస్తూ దిల్ కుశ అతిథి గృహం ముందు రెండున్నర గంటల పాటు బైఠాయించిన వైఎస్సార్ కాంగ్రెస్ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మతో సహా కుటుంబ సభ్యులను ఆదివారం అర్థరాత్రి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు బలవంతంగా వారిని అక్కడి నుంచి లోటస్ పాండ్ లోని జగన్ నివాసానికి తరలించారు. ముందుగా వైవి సుబ్బారెడ్డి, జూపూడి ప్రభాకర్, ఇసి గంగిరెడ్డి, వైఎస్ భారతి లను రెండు వాహనాల్లో తరలించారు. తర్వాత షర్మిల, వైవీ సుబ్బారెడ్డి భార్య, విజయమ్మ, ఎంపీ సబ్బం హరి లను తరలించారు. మరోవైపు ఇంట్లోకి వెళ్లబోమని వారు ఇంటి ముందు బైఠాయించారు.
Home »
» బలవంతంగా వైఎస్ కుటుంబ సభ్యుల తరలింపు
బలవంతంగా వైఎస్ కుటుంబ సభ్యుల తరలింపు
Written By news on Sunday, May 27, 2012 | 5/27/2012
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment