30 నుంచి విజయమ్మ ప్రచారం - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » 30 నుంచి విజయమ్మ ప్రచారం

30 నుంచి విజయమ్మ ప్రచారం

Written By news on Monday, May 28, 2012 | 5/28/2012

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ ఈ నెల 30 నుంచి ఉప ఎన్నికల ప్రచారం ప్రారంభిస్తారు. ఆమె ప్రచార షెడ్యూల్ ని వైఎస్ఆర్ సీపీ నేత తలశిల రఘురాం విడుదల చేశారు. 30వ తేది మధ్యాహ్నం నర్సన్నపేట నుంచి ఆమె
ప్రచారం ప్రారంభిస్తారు. 30, 31వ తేదీల్లో పాయకరావుపేట నియోజకవర్గంలో పర్యటిస్తారు. 31వ తేదీ సాయంత్రం రామచంద్రాపురం నియోజకర్గంలో పర్యటిస్తారు. జూన్ 1న నర్సాపురం, 2న పోలవరం, 3న పత్తిపాడులో వైఎస్ విజయమ్మ ప్రచారం చేస్తారు.

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ లోటస్ పాండ్ వద్ద దీక్ష విరమించిన వెంటనే ఉప ఎన్నికల ప్రచారానికి వెళుతున్నట్లు ప్రకటించారు. న్యాయనిర్ణేతలు మీరే కాబట్టి మీ వద్దకే వస్తున్నానని ప్రజలను ఉద్దేశించి ఆమె అన్నారు. 
ప్రజలకు దూరంగా పెట్టడానికే జగన్మోహన రెడ్డిని రిమాండ్ కు పంపారన్నారు. 

18 మంది పదవులు త్యాగం చేసి ఉప ఎన్నికల బరిలో నిలబడ్డారని, వారిని గెలిపించుకోవలసిన అవసరం ఉందని చెప్పారు. అందుకే తాను ప్రచారాని బయలుదేరుతున్నట్లు తెలిపారు. మీ ముందుకు వస్తున్న తనకు సహకరించాలని కోరారు. స్వర్ణయుగం రావడానికి వారిని గెలిపించుకోవడమే నాంది అన్నారు. పార్టీ సభ్యులందరికీ ఒకే గుర్తు రావడం విజయానికి సూచికగా భావిస్తున్నట్లు చెప్పారు. 
జగన్మోహన రెడ్డి నిర్ధోషిగా బయటకు వస్తారన్న నమ్మకాన్ని ఆమె వ్యక్తం చేశారు.
Share this article :

0 comments: