వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఎంపి జగన్మోహన రెడ్డి బయటకు వచ్చేవరకు శాంతియుతంగా ఆందోళనలు చేయాలని ఆ పార్టీ సిజిసి సమావేశంలో నిర్ణయించినట్లు పార్టీ అధికార ప్రతినిధి గట్టు రామచంద్రరావు చెప్పారు. సమావేశం ముగిసిన అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. విజయమ్మతో దీక్ష విరమింప చేసి ప్రజల్లోకి తీసుకెళ్లాలని తీర్మానించినట్లు చెప్పారు.
ఓటు ద్వారా కాంగ్రెస్, టీడీపీలకు బుద్ధి చెప్పాలని ఓటర్లకు పిలుపు ఇచ్చారు. ప్రజల్లోకి వెళ్లి కాంగ్రెస్, టీడీపీ కుట్రలను తిప్పి కొడతామన్నారు. ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికలు జరగాలని ఎన్నికల కమిషన్ను కోరతామని చెప్పారు. జగన్పై కుట్రలో భాగంగానే టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు మహానాడు కూడా జరపలేదన్నారు. ఉపఎన్నికలను వాయిదా వేయడం కోసమే ఈ కుట్రలని చెప్పారు. ప్రచారంలోకి వెళ్లాల్సిన నేతలను అరెస్ట్ చేస్తున్నారన్నారు. పోటీలో ఉన్న 18 మంది అభ్యర్థులను కూడా అరెస్ట్ చేయడం దారుణం అన్నారు. సీబీఐ జేడీ రాజ్యాంగానికి అతీతంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు.
ఓటు ద్వారా కాంగ్రెస్, టీడీపీలకు బుద్ధి చెప్పాలని ఓటర్లకు పిలుపు ఇచ్చారు. ప్రజల్లోకి వెళ్లి కాంగ్రెస్, టీడీపీ కుట్రలను తిప్పి కొడతామన్నారు. ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికలు జరగాలని ఎన్నికల కమిషన్ను కోరతామని చెప్పారు. జగన్పై కుట్రలో భాగంగానే టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు మహానాడు కూడా జరపలేదన్నారు. ఉపఎన్నికలను వాయిదా వేయడం కోసమే ఈ కుట్రలని చెప్పారు. ప్రచారంలోకి వెళ్లాల్సిన నేతలను అరెస్ట్ చేస్తున్నారన్నారు. పోటీలో ఉన్న 18 మంది అభ్యర్థులను కూడా అరెస్ట్ చేయడం దారుణం అన్నారు. సీబీఐ జేడీ రాజ్యాంగానికి అతీతంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు.
0 comments:
Post a Comment